కువైట్ లో కడప జిల్లా వాసికి 'తెలుగు దేశం-కువైట్' ఆర్ధిక సాయం
- April 14, 2016 కడప జిల్లా రైల్వే కోడూరు వాసి యామల చంద్రయ్య కుటుంబం ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటగిరి లో నివాసం ఉంటుంది. కువైట్ లో భవన కార్మికుని గా పనిచేస్తూ గుండె సంబదిత వ్యాదితో అకాల మృత్యువాత పడ్డాడు. ఇతని వయసు 49 సంవత్సరాలు. ఇతనికి ఇద్దరు పిల్లలు. పేద కుటుంబం నుండి వచ్చిన చంద్రయ్య మరణం తో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.
చంద్రయ్య మరణ వార్తను తెలుసుకొన్న నెల్లూరు జిల్లా వెంకటగిరి శాసన సభ్యులు శ్రీ కురుగుంట్ల రామకృష్ణ నాయుడు గారు తెలుగుదేశం-కువైట్ వారితో మాట్లాడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించడాని కావలిసిన ఏర్పాట్లు చెయ్యవలసిందిగా కోరారు.
నెల్లూరు జిల్లా వేంకటగిరి శాసన సభ్యులు శ్రీ కురుగుంట్ల రామకృష్ణ నాయుడు అభ్యర్ధన మేరకు కువైట్ తెలుగుదేశం సేవా విభాగం మృతదేహం ఇంటికి చేర్చుటకు కావలసిన డాక్యుమెంటేషన్ ను పూర్తి చేసి, దగ్గరుండి మృతదేహాన్ని ఎయిర్ పోర్ట్ కు తరలించారు. పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబానికి తమవంతు సాయంగా 200000 (రెండులక్షల రూపాయలు)ఆర్ధిక సాయాన్ని కూడా అందించారు.
200000 (రెండులక్షల రూపాయలు) చెక్కును మృతిని బందువుకు అందచేసారు. ఈ సందర్భంగా మృతదేహాన్ని ఇండియా కు తరలించడానికి కువైట్ లోని ఇండియన్ ఎంబసి తమ పూర్తి సహాయ సహకారాలు అందించినది. మృతదేహాన్ని ఇండియా కు తరలించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఆర్ధిక సహాయం చేసిన తెలుగుదేశం-కువైట్ గౌరవ సలహాదారులు శ్రీ రావెల్ల సుబ్బారాయుడు(బాబు నాయుడు), కాపెర్ల పట్టాభి రాము నాయుడు, నల్లాని సురేష్ నాయుడు అధ్యక్షులు శ్రీ కుదరవల్లి సుధాకర రావు, మరియు ప్రధాన కార్యదర్శి వెంకటేష్ నాయుడు వేగి గార్లను నెల్లూరు జిల్లా వేంకటగిరి శాసన సభ్యులు శ్రీ కురుగుంట్ల రామకృష్ణ నాయుడు గారు అభినందించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..