నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావల్సిందే: అనితా బోస్

- August 16, 2022 , by Maagulf
నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావల్సిందే: అనితా బోస్

నేతాజీ మరణం చరిత్రలో ఒక మిస్టరీగా మిగిలిపోయింది. తాజాగా నేతాజి కుమార్తె అనితా బోస్ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా చేసిన వ్యాఖలు మళ్లీ చర్చలోకి వస్తున్నాయి. జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో ఉన్న ఆయన అస్థికలకు డీఎన్ఏ పరీక్ష చేయాలని అన్నారు. కొందరు నేతాజీ మరణించలేదు.. తప్పించుకున్నాడంటున్నారని.. నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. నేజాతీ అస్థికలను భారత్‌కు తీసుకువచ్చే కార్యక్రమం చేపట్టాలన్నారు. నేతాజీ 1930లో జర్మనీలో ఎమిలి షెంకెల్‌తో ప్రేమతో పడ్డారు. వారికి అనితా బోస్ జన్మించింది. ప్రస్తుతం అనితీ బోస్‌కు 79 ఏళ్లు. జర్మనీలో సోషల డెమోక్రటిక్ పార్టీ నేతగా కొనసాగుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com