దిల్ రాజు ఫ్రస్టేషన్: సోషల్ మీడియాతో ఆటలా.?
- August 17, 2022‘కార్తికేయ 2’ సినిమాపై టాలీవుడ్లో కొందరు కావాలనే బురద చల్లే ప్రయత్నం చేశారనీ, కావాలనే సినిమాని తొక్కేశారనే ప్రచారం జరిగింది. అందులో కీలకమైన భాగస్వామ్యం నిర్మాత దిల్ రాజుదే అనే ప్రచారం కూడా వుంది.
వాయిదాల పర్వంతో సతమతమైన ‘కార్తికేయ 2’, ఎట్టకేలకు రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే, రిలీజ్ తర్వాత కూడా ఈ సినిమాని వాయిదా వేసినందుకు రచ్చ ఆగలేదు.
నెట్టింట ట్రోలింగ్ జురగుతూనే వుంది. దాంతో, దిల్ రాజు బయటికి వచ్చారు. తన తప్పేం లేదంటూ, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాపై దారుణంగా చురకలంటించారు.
వాస్తవాలు తెలుసుకోకుండా ఏది పడితే అది రాసేస్తే కుదరదనీ, హెచ్చరించారు. అంతేకాడు, వాస్తవాలు తెలిస్తే రాయండి. లేదంటే మూస్కోండి.. అంటూ సోషల్ మీడియాపై స్ర్టాంగ్ కౌంటర్స్ వేశారు.
నిఖిల్ తనకు ఆప్తుడనీ, పీపుల్స్ మీడియా సంస్థతో తనకెంతో మంచి అనుబంధం వుందనీ, అయినా, అది టాలీవుడ్లో బెస్ట్ పొజిషన్లో వున్న నిర్మాణ సంస్థ అనీ, దాన్నిఆపే దమ్ము ఎవరికి వుందంటూ, రాసే ముందు కాస్తయినా కామన్సెన్స్ యూజ్ చేయాలనీ ఫైర్ అయ్యారు దిల్ రాజు.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి