శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత

- August 19, 2022 , by Maagulf
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత

హైదరాబాద్: విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకు వస్తున్న ప్రయాణికుడిని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి 436 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను శనివారం తనిఖీలు చేస్తున్నారు.షార్జా నుండి హైదరాబాద్ వచ్చిన ఒక వ్యక్తి వద్ద 436 గ్రాముల అక్రమ బంగారాన్ని గుర్తించారు.ఎలక్ట్రిక్ బ్లెండర్స్ లో బంగారం అమర్చి తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కిన స్మగ్లర్.

వ్యక్తి వద్ద బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితులను విచారణ చేపట్టారు. ఇద్దరి వద్ద పట్టుబడ్డ బంగారం విలువ షుమారు రూ.23,14,200 లక్షలకు పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.

--శ్రీనివాస్ మంచర్ల(మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com