ఉక్రెయిన్కు అమెరికా భారీ ప్యాకేజ్..
- August 20, 2022
రష్యాతో తీవ్ర యుద్ధం చేస్తోన్న ఉక్రెయిన్కు అమెరికా భారీ ప్యాకేజీ ప్రకటించింది. 775 మిలియన్ డాలర్ల విలువైన హిమర్స్ మిసైల్స్, అర్టిలరీ, మైన్ క్లియరింగ్ సిస్టమ్స్తో కూడిన ఆయుధ సమాగ్రిని పంపనున్నట్లు శుక్రవారం అమెరికా డిఫెన్స్ విభాగం వెల్లడించింది. ప్రెసిడెన్షియల్ డ్రాడౌన్ ద్వారా ఈ ప్యాకేజీని పంపనున్నట్లు ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. తాజాగా ప్రకటించిన ప్యాకేజీతో కలిసి 2021 ఆగస్టు నుంచి ఉక్రెయిన్కు అమెరికా మొత్తం 10 బిలియన్ డాలర్ల పీడీఏ ప్యాకేజీని పూర్తి చేసుకుంది.
తాజా ప్యాకేజీ 18వది కాగా, ఇందులో హై మొబిలిటీ అర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ ప్రధానంగా చర్చకు వస్తోంది. వీటి ప్రత్యేకత ఏంటంటే.. ఒక సారి దాడి చేశాక వీటిని శత్రువు పసిగట్టి ఎదురు దాడి చేయకుండా అక్కడి నుంచి వేగంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది. 186 నుంచి 310 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఇవి ఛేదించగలవు. కాగా, ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలు పంపడం ఇదే మొదటిసారని అమెరికా రక్షణ అధికారి ఒకరు తెలిపారు.
అయితే ఈ ఆయుధాలు పంపే క్రమంలో ఉక్రెయిన్కు అమెరికా ఒక షరతు విధించింది. రష్యా దాడులను నిలువరించడానికి మాత్రమే వీటిని వాడుకోవాలని, రష్యా భూభాగంలో దాడి చేయడానికి కాదని అమెరికా స్పష్టం చేసింది. నాటో-రష్యా మధ్య తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని స్పష్టం చేసింది. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై నెలలు గడుస్తున్న సమస్య సద్దుమణగడం లేదు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రపంచ దేశాలు సూచించినప్పటికీ ఇదరు దేశాధినేతలు యుద్ధ రంగంలో తలమునకలై ఈ సూచనలను పట్టించుకోవడం లేదు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







