అమిత్ షా తో భేటీ అయిన ఎన్టీఆర్
- August 22, 2022
హైదరాబాద్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా..సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో వీరిద్దరూ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..ఎన్టీఆర్ ను అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్కు అమిత్ షా పుష్పగుచ్ఛంతో స్వాగతం పలకగా.. ఎన్టీఆర్ ఆయనను శాలువాతో సత్కరించారు. 20 నిమిషాల పాటు అమిత్ షా, ఎన్టీఆర్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అనంతరం అమిత్ షా, కిషన్రెడ్డి, తరుణ్ఛుగ్, బండి సంజయ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి భోజనం చేశారు.
వీరిద్దరి భేటీ ఫై బిజెపి నేతలు మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్తో భేటీలో అమిత్ షా సీనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన నటించిన విశ్వామిత్ర, దానవీరశూర కర్ణ వంటి సినిమాలు తాను చూశానని చెప్పారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారులు బాగా పనిచేసేవారన్నారు.అనంతరం షా ఓ ట్వీట్ చేస్తూ.. ‘‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, మన తెలుగు సినిమా తారకరత్నం జూనియర్ ఎన్టీఆర్తో ఈ రోజు హైదరాబాద్లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది’’ అని ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించారు.
అంతకు ముందు మునుగోడు సభ లో అమిత్ షా పాల్గొన్నారు. ఉపఎన్నికల్లో బిజెపి ని గెలిచిపించాలని కోరారు. అలాగే టిఆర్ఎస్ సర్కార్ తీరు ఫై నిప్పులు చెరిగారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!







