అమిత్ షా తో భేటీ అయిన ఎన్టీఆర్
- August 22, 2022
హైదరాబాద్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా..సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో వీరిద్దరూ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..ఎన్టీఆర్ ను అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్కు అమిత్ షా పుష్పగుచ్ఛంతో స్వాగతం పలకగా.. ఎన్టీఆర్ ఆయనను శాలువాతో సత్కరించారు. 20 నిమిషాల పాటు అమిత్ షా, ఎన్టీఆర్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అనంతరం అమిత్ షా, కిషన్రెడ్డి, తరుణ్ఛుగ్, బండి సంజయ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి భోజనం చేశారు.
వీరిద్దరి భేటీ ఫై బిజెపి నేతలు మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్తో భేటీలో అమిత్ షా సీనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన నటించిన విశ్వామిత్ర, దానవీరశూర కర్ణ వంటి సినిమాలు తాను చూశానని చెప్పారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారులు బాగా పనిచేసేవారన్నారు.అనంతరం షా ఓ ట్వీట్ చేస్తూ.. ‘‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, మన తెలుగు సినిమా తారకరత్నం జూనియర్ ఎన్టీఆర్తో ఈ రోజు హైదరాబాద్లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది’’ అని ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించారు.
అంతకు ముందు మునుగోడు సభ లో అమిత్ షా పాల్గొన్నారు. ఉపఎన్నికల్లో బిజెపి ని గెలిచిపించాలని కోరారు. అలాగే టిఆర్ఎస్ సర్కార్ తీరు ఫై నిప్పులు చెరిగారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







