ప్రధాని మోడీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ..

- August 22, 2022 , by Maagulf
ప్రధాని మోడీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ..

న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్‌ భేటీ ముగిసింది.ఏపీ విభజన హామీలు, ఏపీ అభివృద్ధికి సహకరించాలని జగన్ ప్రధానికి కోరారు.పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మోదీతో జగన్ చర్చించినట్లుగా తెలుస్తోంది.అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితుల పరిహారంపైనే ప్రధాన చర్చ జరిగినట్లు సమాచారం.ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాలు, ముంపు మండలాల్లో పర్యటించిన జగన్ పరిహారం అంశాన్ని ప్రధానితో చర్చిస్తానని పోలవరం నిర్వాసితులకు హామి ఇచ్చారు.దీంట్లో భాగంగానే సీఎం ప్రధానితో చర్చించారు. ముంపు నిర్వాశితులకు పునరావాస్ ప్యాకేజీ త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com