బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయం.. 11 మంది నిందితులు అరెస్టు
- August 23, 2022
రియాద్: సౌదీ పౌరులు, నివాసితుల బ్యాంక్ ఖాతాల నుండి డబ్బును మాయం చేస్తోన్న ముఠాలోని 11 మంది సభ్యలను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. 11 మంది అనుమానితులు తమ అక్రమ కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలుగా ఓ అద్దె ఇంటిని తీసుకున్నట్లు తమ విచారణలో తేలిందని అధికారులు పేర్కొన్నారు. నిందితులు తీవ్రమైన నేరాలకు పాల్పడినందున వారిని అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ముఠా సభ్యులు బ్యాంకు ఉద్యోగుల నటిస్తూ.. బాధితలతో మాట్లడారని పోలీసులు తెలిపారు. బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయని, ఏటీఎం కార్డులు డీయాక్టివేట్ అయ్యాయని అనుమానితులు బాధితుల ఫోన్లకు సందేశాలు పంపేవారన్నారు. తిరిగి వాటిని యాక్టివేట్ చేసే పేరుతో ఖాతాదారుల రహస్య సమాచారాన్ని తెలుసుకొని వారి ఖాతాల్లోని మొత్తాలను కాజేసేవారని అధకారులు వివరించారు. బ్యాకింగ్ మోసాలపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







