మోసం, మనీలాండరింగ్ కేసు.. మహిళకు జైలు శిక్ష
- August 23, 2022
బహ్రెయిన్: స్కామింగ్, మనీలాండరింగ్ కు పాల్పడిన ఒక ఆసియా మహిళకు హై క్రిమినల్ కోర్ట్ నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, 46,000 బిడిలు జరిమానా విధించింది. ఈ కేసులో నేరంలో పాల్గొన్నందుకు సాక్ష్యాలు లేకపోవడంతో ఒక ఆసియా వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. పోలీసు రికార్డుల ప్రకారం.. నకిలీ బ్యాంక్ కాల్స్, మోసపూరిత గేమ్స్ ద్వారా అనేక మంది బాధితులను విదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తితో కలిసి బాధిత మహిళ మోసం చేసింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ & ఎలక్ట్రానిక్ సెక్యూరిటీకి బాధితుల నుండి అనేక ఫిర్యాదులు అందడంతో ఆమె వ్యవహరం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఖాతాల నుంచి స్వాహా చేసిన డబ్బును ఆఫ్షోర్ ఖాతాలకు పంపకముందే ఆమె ఖాతాకు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. అనుమానాస్పద లావాదేవీలు జరపడం ద్వారా మహిళ తనకు వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని లాండరింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. మహిళ వీసా కార్డును కూడా ఉపయోగించినట్లు పోలీసు అధికారులు గుర్తించారు. శిక్ష అనుభవించిన తర్వాత నిందితురాలిని దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









