మోసం, మనీలాండరింగ్ కేసు.. మహిళకు జైలు శిక్ష
- August 23, 2022
బహ్రెయిన్: స్కామింగ్, మనీలాండరింగ్ కు పాల్పడిన ఒక ఆసియా మహిళకు హై క్రిమినల్ కోర్ట్ నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, 46,000 బిడిలు జరిమానా విధించింది. ఈ కేసులో నేరంలో పాల్గొన్నందుకు సాక్ష్యాలు లేకపోవడంతో ఒక ఆసియా వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. పోలీసు రికార్డుల ప్రకారం.. నకిలీ బ్యాంక్ కాల్స్, మోసపూరిత గేమ్స్ ద్వారా అనేక మంది బాధితులను విదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తితో కలిసి బాధిత మహిళ మోసం చేసింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ & ఎలక్ట్రానిక్ సెక్యూరిటీకి బాధితుల నుండి అనేక ఫిర్యాదులు అందడంతో ఆమె వ్యవహరం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఖాతాల నుంచి స్వాహా చేసిన డబ్బును ఆఫ్షోర్ ఖాతాలకు పంపకముందే ఆమె ఖాతాకు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. అనుమానాస్పద లావాదేవీలు జరపడం ద్వారా మహిళ తనకు వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని లాండరింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. మహిళ వీసా కార్డును కూడా ఉపయోగించినట్లు పోలీసు అధికారులు గుర్తించారు. శిక్ష అనుభవించిన తర్వాత నిందితురాలిని దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







