మీడియా రంగంలోకి అదానీ గ్రూప్
- August 23, 2022
ముంబై: వ్యాపార రంగంలో తిరుగు లేకుండా దూసుకుపోతున్న అదానీ గ్రూప్.. ఇప్పుడు మీడియాలోకీ ఎంట్రీ ఇస్తోంది. NDTV హస్తగతం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను పరోక్షంగా తమ గ్రూప్ సంస్థ కొనుగోలు చేయనున్నట్లు అదానీ ఎంటర్ ప్రైజెస్ తెలిపింది. మరో 26శాతం వాటాల కొనుగోలుకు రెండు సంస్థలతో కలిసి అదానీ ఎంటర్ ప్రైజెస్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
విశ్వప్రదాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ తో కలిసి పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి వాటాలను కొనుగోలు చేయనుంది అదానీ ఎంటర్ ప్రైజెస్. 4 రూపాయల ముఖ విలువ కలిగిన కోటి 67లక్షలకు పైగా షేర్లను ఈ సంస్థలతో కలిసి అదానీ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఒక్కో షేర్ కు 294 రూపాయలను ఆఫర్ చేసింది అదానీ సంస్థ. ఓపెన్ ఆఫర్లలో షేర్ల కొనుగోలుకు 492.8 కోట్లు చెల్లించనుంది. ఎన్డీటీవీని ప్రణయ్ రాయ్ ప్రారంభించారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









