మీడియా రంగంలోకి అదానీ గ్రూప్
- August 23, 2022
ముంబై: వ్యాపార రంగంలో తిరుగు లేకుండా దూసుకుపోతున్న అదానీ గ్రూప్.. ఇప్పుడు మీడియాలోకీ ఎంట్రీ ఇస్తోంది. NDTV హస్తగతం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను పరోక్షంగా తమ గ్రూప్ సంస్థ కొనుగోలు చేయనున్నట్లు అదానీ ఎంటర్ ప్రైజెస్ తెలిపింది. మరో 26శాతం వాటాల కొనుగోలుకు రెండు సంస్థలతో కలిసి అదానీ ఎంటర్ ప్రైజెస్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
విశ్వప్రదాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ తో కలిసి పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి వాటాలను కొనుగోలు చేయనుంది అదానీ ఎంటర్ ప్రైజెస్. 4 రూపాయల ముఖ విలువ కలిగిన కోటి 67లక్షలకు పైగా షేర్లను ఈ సంస్థలతో కలిసి అదానీ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఒక్కో షేర్ కు 294 రూపాయలను ఆఫర్ చేసింది అదానీ సంస్థ. ఓపెన్ ఆఫర్లలో షేర్ల కొనుగోలుకు 492.8 కోట్లు చెల్లించనుంది. ఎన్డీటీవీని ప్రణయ్ రాయ్ ప్రారంభించారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







