‘లైగర్’ ‌తో అడ్వాన్స్ బుకింగ్స్ మళ్లీ పుంజుకున్నాయ్‌గా.!

- August 23, 2022 , by Maagulf
‘లైగర్’ ‌తో అడ్వాన్స్ బుకింగ్స్ మళ్లీ పుంజుకున్నాయ్‌గా.!

ఈ మధ్య ధియేటర్లలో విడుదలయ్యే సినిమాల పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రీ రిలీజ్ బజ్, అడ్వాన్స్ బుకింగ్స్ హవా.. అబ్బో ఓ రేంజ్‌లో వుండేది హంగామా. కానీ, అదంతా ఢమాల్ అయ్యింది. 
వరుస ఫ్లాపులు, సినీ ఇండస్ర్టీని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. అయితే, ఇటీవల వచ్చిన ‘సీతారామం’, ‘బింబిసార’, ‘కార్తికేయ 2’ తదితర సినిమాల వల్ల మళ్లీ ధియేటర్లు కాస్త కళకళలాడుతున్నాయ్.
దాంతో, రాబోయే సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ పెరుగుతున్నాయట. ముఖ్యంగా ‘లైగర్ - ది క్రాస్ బ్రీడ్’ అంటూ భారీ అంచనాల మీద విడుదలవుతున్న ‘లైగర్’‌కి అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయట.
‘సర్కారు వారి పాట’, ‘ఆచార్య’ తదితర సినిమాలతో అడ్వాన్స్ బుకింగ్స్ దారుణంగా పడిపోయాయ్. అంతకు ముందు వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమా తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ని పక్కన పెట్టేస్తే, మరే సినిమాకి ఆ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగింది లేదు.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ‘లైగర్’ సినిమాకి ఊహించని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయట. ఆగస్టు 25 న ‘లైగర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరీ జగన్నాధ్ ఈ సినిమాకి దర్శకుడు. కరణ్ జోహార్‌తో కలిసి, ఛార్మీ ఈ సినిమాని నిర్మిస్తోంది. అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com