ప్రవాసులకు శుభవార్త..
- August 24, 2022
న్యూ ఢిల్లీ: ఎన్నారై విద్యార్థులకు మేలు కలిగేలా భారత ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం అమలులోకి వస్తే.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులకు చాలా వరకు ఇబ్బందులు తప్పనున్నాయి.
ఇండియాలోని ఐఐటీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశ వ్యాప్తంగా ఉన్న పలు IIT క్యాంపస్లలో అడ్మిషన్ పొందేందుకు వేలాది మంది విద్యార్థులు పోటీ పడతారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు కూడా ఐఐటీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీలను ఇతర దేశాలకు విస్తరించాలని భావిస్తోంది.ఇండియన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో దాదాపు ఏడు దేశాల్లో వీటిని ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది.ఈ క్రమంలోనే యూకే, యూఏఈ, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతర్, మలేషియా, థాయ్లాండ్ దేశాల్లో క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు 17 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ కమిటీ కూడా ఇప్పటికే ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో ఐఐటీల ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కాగా.. విదేశాల్లో ఐఐటీ క్యాంపస్లు ఏర్పాటైతే.. ఎన్నారై విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







