‘కార్తికేయ 2’కు అభినందనలు తెలిపిన గుజరాత్ ముఖ్యమంత్రి.!
- August 30, 2022
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ‘కార్తికేయ 2’ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా చాలా బాగుందని కొనియాడారు. కృష్ణ తత్వం గురించి సినిమాల చాలా చక్కగా చూపించారనీ ‘కార్తికేయ 2’ టీమ్ని అభినందించారు భూపేంద్ర పటేల్.
నిఖిల్ సిద్డార్ద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ‘కార్తికేయ 2’ సినిమా ఆగస్టు 13న రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. కటౌట్తో సంబంధం లేకుండా కంటెంట్ రిచ్ మూవీగా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది ‘కార్తికేయ 2’ సినిమా.
నిఖిల్ కెరీర్లో బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్న సినిమాగా ‘కార్తికేయ 2’ నిలిచింది. అనూహ్యంగా ఈ సినిమా నార్త్ జనాల్ని బాగా ఆకట్టుకుంటోంది. విడుదలై ఇన్ని వారాలు గడిచినా ఇంకా ధియేటర్లలో రన్ అవుతోంది. ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ కేవలం ఒక్క వారానికే పరిమితమవుతుండగా, ‘కార్తికేయ 2’ మాత్రం సక్సెస్ఫుల్గా గత మూడు వారాలుగా రన్ అవుతూనే వుంది.
సినిమా సక్సెస్ ప్రమోషన్స్లో భాగంగా నిఖిల్ అండ్ టీమ్ తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రిని కలిశారు. ఈ మీటింగ్ సందర్భంగానే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పై విధంగా కార్తికేయ టీమ్ని అభినందించారు. అన్నట్లు ఈ సినిమాలో కొంత భాగం గుజరాత్లోనూ షూటింగ్ చేయడం విశేషం.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







