షార్జా ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- September 02, 2022
యూఏఈ: 430,000 దిర్హామ్ల విలువైన బంగారాన్నితన లగేజీలో దాచి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన 35 ఏళ్ల ఆసియా వ్యక్తిని షార్జా ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్టు చేశారు. షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని బ్యాగేజీ చెకింగ్ కౌంటర్లోని అధికారులకు సదరు ప్రయాణీకుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిందని, ఆ తర్వాత అతని హ్యాండ్ లగేజీని చేక్ చేసినట్లు ఎయిర్పోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ మటర్ సుల్తాన్ అల్ కెత్బీ తెలిపారు. తనిఖీల్లో ఆ వ్యక్తి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను ఇన్వాయిస్, ఆభరణాలు తనవేనని రుజువు చేసే పేపర్లు లేకుండా తీసుకెళ్తున్నట్లు గుర్తించినట్లు కెత్బీ వివరించారు. యూఏఈలోని ఇసుక ప్రాంతంలో తనకు ఆ బంగారం దొరికిందని నిందితుడు తమ విచారణలో పేర్కొన్నాడని సుల్తాన్ అల్ కెత్బీ చెప్పారు. తదుపరి విచారణ కోసం నిందితుడిని పోలీసులకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







