ఈ ఏడాది 15 వేలమంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్
- September 03, 2022
కువైట్: ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు కువైట్లోని విదేశీయుల నివాస చట్టంలోని ఆర్టికల్ 16ను ఉల్లంఘించిన 15,000 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లు, మాల్స్, వ్యాపార కేంద్రాలలో భద్రతా తనిఖీలు నిరంతరం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నివాస చట్ట నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రవాసుల నివాసం చెల్లుబాటు అయినప్పటికీ వారు చట్టాలను ఉల్లంఘించే చర్యలకు పాల్పడితే దేశం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. దేశంలోని లేబర్ మార్కెట్ మార్జినల్ వర్కర్లను నియంత్రించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు









