ఈ ఏడాది 15 వేలమంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్
- September 03, 2022
కువైట్: ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు కువైట్లోని విదేశీయుల నివాస చట్టంలోని ఆర్టికల్ 16ను ఉల్లంఘించిన 15,000 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లు, మాల్స్, వ్యాపార కేంద్రాలలో భద్రతా తనిఖీలు నిరంతరం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నివాస చట్ట నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రవాసుల నివాసం చెల్లుబాటు అయినప్పటికీ వారు చట్టాలను ఉల్లంఘించే చర్యలకు పాల్పడితే దేశం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. దేశంలోని లేబర్ మార్కెట్ మార్జినల్ వర్కర్లను నియంత్రించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







