ఈ ఏడాది 15 వేలమంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్
- September 03, 2022
కువైట్: ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు కువైట్లోని విదేశీయుల నివాస చట్టంలోని ఆర్టికల్ 16ను ఉల్లంఘించిన 15,000 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లు, మాల్స్, వ్యాపార కేంద్రాలలో భద్రతా తనిఖీలు నిరంతరం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నివాస చట్ట నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రవాసుల నివాసం చెల్లుబాటు అయినప్పటికీ వారు చట్టాలను ఉల్లంఘించే చర్యలకు పాల్పడితే దేశం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. దేశంలోని లేబర్ మార్కెట్ మార్జినల్ వర్కర్లను నియంత్రించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







