ప్రయాణికుల కోసం టిఎస్ఆర్టీసీ మరో ఆఫర్
- September 03, 2022
హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ ప్రయాణికుల కోసం మరో రాయితీని ప్రకటించింది. హైదరాబాద్ – విజయవాడ, హైదరాబాద్–బెంగళూరు వెళ్లే గరుడ, రాజధాని సర్వీసుల ఛార్జీలను ఈ నెలాఖరు వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ రెండు మార్గాల్లో నడిచే అంతర్రాష్ట్ర బస్సులు అంటే గరుడ ప్లస్, రాజధాని సర్వీసులలో శుక్రవారం, ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో టిక్కెట్టు ఛార్జీలో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు.బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులకు శుక్రవారం, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసుల్లో ఆదివారం తగ్గింపు వర్తించదని స్పష్టం చేసింది. ఈ రాయితీ ఛార్జీలు ఈ నెల 30 వరకు వర్తించనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







