ప్రయాణికుల కోసం టిఎస్ఆర్టీసీ మరో ఆఫర్
- September 03, 2022
హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ ప్రయాణికుల కోసం మరో రాయితీని ప్రకటించింది. హైదరాబాద్ – విజయవాడ, హైదరాబాద్–బెంగళూరు వెళ్లే గరుడ, రాజధాని సర్వీసుల ఛార్జీలను ఈ నెలాఖరు వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ రెండు మార్గాల్లో నడిచే అంతర్రాష్ట్ర బస్సులు అంటే గరుడ ప్లస్, రాజధాని సర్వీసులలో శుక్రవారం, ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో టిక్కెట్టు ఛార్జీలో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు.బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులకు శుక్రవారం, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసుల్లో ఆదివారం తగ్గింపు వర్తించదని స్పష్టం చేసింది. ఈ రాయితీ ఛార్జీలు ఈ నెల 30 వరకు వర్తించనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







