నూతన టూరిజం ఈవెంట్ ను ప్లాన్ చేసిన బహ్రెయిన్
- September 04, 2022
మనామా: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నం లో భాగంగా బహ్రెయిన్ పర్యాటక శాఖ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మనామా సౌక్లో 10 రోజుల పాటు జరిగే హెరిటేజ్ ఈవెంట్ను నిర్వహించే ప్రణాళికలను గురించి బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) ప్రకటించింది.
ఈ "రోడ్ టు మనామా" BTEA ద్వారా సెప్టెంబర్ 22 - అక్టోబర్ 1 సాయంత్రం వేళల్లో నిర్వహించబడుతుంది. పిల్లలు మరియు యుక్తవయస్కులకు సాంప్రదాయ బహ్రెయిన్ క్రాఫ్ట్లను పరిచయం చేయడానికి మరియు వాటిని ఎలా నేర్చుకోవాలో నేర్పడానికి రూపొందించిన వివిధ వర్క్షాప్లు ఇందులో ఉంటాయి.
రోడ్ టు మనామాతో పాటు సాంప్రదాయ బహ్రెయిన్ గేమ్లు, సంగీత ప్రదర్శనలు, పిల్లల కథలు చెప్పడం వంటి అనేక పబ్లిక్ ఈవెంట్లు ఉంటాయి. సౌదీ జాతీయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 22 - 24 తేదీలలో తోలుబొమ్మల ప్రదర్శన నిర్వహించబడుతుంది అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









