నూతన టూరిజం ఈవెంట్ ను ప్లాన్ చేసిన బహ్రెయిన్
- September 04, 2022
మనామా: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నం లో భాగంగా బహ్రెయిన్ పర్యాటక శాఖ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మనామా సౌక్లో 10 రోజుల పాటు జరిగే హెరిటేజ్ ఈవెంట్ను నిర్వహించే ప్రణాళికలను గురించి బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) ప్రకటించింది.
ఈ "రోడ్ టు మనామా" BTEA ద్వారా సెప్టెంబర్ 22 - అక్టోబర్ 1 సాయంత్రం వేళల్లో నిర్వహించబడుతుంది. పిల్లలు మరియు యుక్తవయస్కులకు సాంప్రదాయ బహ్రెయిన్ క్రాఫ్ట్లను పరిచయం చేయడానికి మరియు వాటిని ఎలా నేర్చుకోవాలో నేర్పడానికి రూపొందించిన వివిధ వర్క్షాప్లు ఇందులో ఉంటాయి.
రోడ్ టు మనామాతో పాటు సాంప్రదాయ బహ్రెయిన్ గేమ్లు, సంగీత ప్రదర్శనలు, పిల్లల కథలు చెప్పడం వంటి అనేక పబ్లిక్ ఈవెంట్లు ఉంటాయి. సౌదీ జాతీయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 22 - 24 తేదీలలో తోలుబొమ్మల ప్రదర్శన నిర్వహించబడుతుంది అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







