నూతన టూరిజం ఈవెంట్ ను ప్లాన్ చేసిన బహ్రెయిన్
- September 04, 2022
మనామా: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నం లో భాగంగా బహ్రెయిన్ పర్యాటక శాఖ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మనామా సౌక్లో 10 రోజుల పాటు జరిగే హెరిటేజ్ ఈవెంట్ను నిర్వహించే ప్రణాళికలను గురించి బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) ప్రకటించింది.
ఈ "రోడ్ టు మనామా" BTEA ద్వారా సెప్టెంబర్ 22 - అక్టోబర్ 1 సాయంత్రం వేళల్లో నిర్వహించబడుతుంది. పిల్లలు మరియు యుక్తవయస్కులకు సాంప్రదాయ బహ్రెయిన్ క్రాఫ్ట్లను పరిచయం చేయడానికి మరియు వాటిని ఎలా నేర్చుకోవాలో నేర్పడానికి రూపొందించిన వివిధ వర్క్షాప్లు ఇందులో ఉంటాయి.
రోడ్ టు మనామాతో పాటు సాంప్రదాయ బహ్రెయిన్ గేమ్లు, సంగీత ప్రదర్శనలు, పిల్లల కథలు చెప్పడం వంటి అనేక పబ్లిక్ ఈవెంట్లు ఉంటాయి. సౌదీ జాతీయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 22 - 24 తేదీలలో తోలుబొమ్మల ప్రదర్శన నిర్వహించబడుతుంది అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







