విమాన క్యాబిన్ నుంచి 20 కోట్ల బంగారం చోరీ..!!
- September 06, 2022
దుబాయ్: విమానంలో వెళ్లే సమయంలో ఆభరణాల వ్యాపారి బ్యాగ్ నుంచి రూ.20 కోట్ల విలువైన బంగారం చోరీకి గురైంది. అధికారులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం దుబాయ్ నుండి కరాచీకి వెళ్లే విమానంలో పాకిస్తానీ నగల వ్యాపారి మహ్మద్ మూనిస్ ప్రయాణించాడు. ఈ క్రమంలో తన బ్యాగ్ నుంచి 1,542 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి.. విమాన సిబ్బందికి చెప్పారు. దీంతో సిబ్బంది చోరీకి గురైన బంగారం కోసం విమానమంత వెతికినా ఫలితం లేదు. విమానం కరాచీలో ల్యాండ్ అయిన తర్వాత బంగారం కోసం ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఏఎస్ఎఫ్) రంగంలోకి దిగి ప్రయాణికులను స్కానింగ్ చేసింది. అయినా విమానంలో చోరీకి గురైన బంగారం మాత్రం లభించలేదు. బంగారాన్ని తీసుకురావడంపై కస్టమ్స్ అధికారులకు ముందుగానే సమాచారం అందించినట్లు నగల వ్యాపారి పేర్కొన్నారు. తాను చట్టబద్ధంగా ఎగుమతి చేసిన ఆభరణాలలో సగం విలువను బంగారం రూపంలో తిరిగి తీసుకెళుతున్నట్లు.. చోరీకి గురైన బంగారం కరాచీకి చెందిన నౌరత్తన్ జ్యువెలర్స్కు చెందినదని సదరు వ్యాపారి తెలిపారు. మరోవైపు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరే సమయంలోనే బంగారం దొంగతనం జరిగి ఉండవచ్చని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఫ్లైట్ టేకాఫ్ సమయంలో తన బ్యాగ్ లో బంగారం ఉన్నట్లు బాధిత నగల వ్యాపారి చెబుతున్నాడు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు