కరెంట్ కోత కారణాలపై విచారణ ప్రారంభం
- September 06, 2022
మస్కట్: ఒమన్ లోని సుల్తానేట్ ప్రాంతంలో సోమవారం కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. చాలా సేపు కరెంట్ పోవటంతో ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పనిచేయలేదు. ఐతే కరెంట్ కోతలకు సాంకేతిక సమస్యలు తలెత్తటమే కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.ఐతే దీనికి పూర్తి కారణాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. పబ్లిక్ సర్వీస్ అథారిటీ (PSRA) అధికారులు ఇబ్రీ విద్యుత్ స్టేషన్ ను సందర్శించారు. మెయిన్ కనెక్టెడ్ నెట్ వర్క్ లో తలెత్తిన సమస్య కారణంగానే కరెంట్ సప్లయ్ తో ఇబ్బందులు తలెత్తాయని గుర్తించారు. భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను విచారణాధికారులు ప్రభుత్వానికి సూచించనున్నారు.
తాజా వార్తలు
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్లో వాట్సాప్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్లో విషాదం.. బాత్టబ్లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక







