కరెంట్ కోత కారణాలపై విచారణ ప్రారంభం
- September 06, 2022
మస్కట్: ఒమన్ లోని సుల్తానేట్ ప్రాంతంలో సోమవారం కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. చాలా సేపు కరెంట్ పోవటంతో ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పనిచేయలేదు. ఐతే కరెంట్ కోతలకు సాంకేతిక సమస్యలు తలెత్తటమే కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.ఐతే దీనికి పూర్తి కారణాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. పబ్లిక్ సర్వీస్ అథారిటీ (PSRA) అధికారులు ఇబ్రీ విద్యుత్ స్టేషన్ ను సందర్శించారు. మెయిన్ కనెక్టెడ్ నెట్ వర్క్ లో తలెత్తిన సమస్య కారణంగానే కరెంట్ సప్లయ్ తో ఇబ్బందులు తలెత్తాయని గుర్తించారు. భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను విచారణాధికారులు ప్రభుత్వానికి సూచించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









