కృష్ణవంశీ. సందీప్ కిషన్ కాంబినేషన్ ...
- April 16, 2016
ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న కృష్ణవంశీ పరిస్థితి ఇప్పుడు ఏమంత బాగోలేదు. ముఖ్యంగా మొగుడు, పైసా సినిమాaతో కృష్ణవంశీ క్రియేటివిటీ మీదే అనుమానాలు మొదలయ్యాయి. అయితే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గోవిందుడు అందరివాడేలే మంచి వసూళ్లను రాబట్టడంతో కాస్త పరవాలేదనిపించాడు. కానీ అవకాశాల కోసం మాత్రం చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది.ఫైనల్ గా రుద్రాక్ష పేరుతో ఓ ఫాంటసీ సినిమాను ప్లాన్ చేశాడు కృష్ణవంశీ, అయితే ఈ సినిమా చర్చల దశలో ఉండగానే బాలయ్య వందో సినిమా కోసం పిలుపు రావటంతో రుద్రాక్షను పక్కన పెట్టాశాడు. కానీ బాలయ్య సినిమా కూడా ఫైనల్ కాకపోవటంతో రెండు సినిమాలు ఆగిపోయాయి. దీంతో ఆలోచనలో పడ్డ కృష్ణవంశీ ప్రస్తుతం ఓ కుర్ర హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడట.యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు కృష్ణవంశీ. సందీప్ కిషన్ కూడా కెరీర్ లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. దీంతో ఈ ఇద్దరు కలిసి ఓ భారీ హిట్ కొట్టాలని భావిస్తున్నారట. మరి ఈ సినిమానైనా కృష్ణవంశీ సెట్స్ మీదకు తీసుకువస్తాడేమో చూడాలి.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







