24 గంటల వ్యవధిలో మూడు మృతదేహాలు లభ్యం
- September 11, 2022
కువైట్ సిటీ: అనుమానాస్పద పరిస్థితుల్లో 24 గంటల వ్యవధిలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. అల్-దబయ్యా తీరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. అంతకుముందు ఫహాహీల్లోని బహిరంగ ప్రదేశంలో పార్క్ చేసిన కారులో గుర్తుతెలియని వ్యక్తి శవాన్ని గుర్తించామన్నారు. అలాగే అల్-ఖైరాన్ శివారులోని వాహనంలో మరో గుర్తు తెలియని యువతి శవం కనిపించిందని పోలీసులు వెల్లడించారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు భద్రతాధికారులు తెలిపారు. మరో సంఘటనలో సెవెంత్ రింగ్ రోడ్లో మరో కారు ఢీకొనడంతో కువైట్ మహిళ మరణించిందని, ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నలుగురి మృతదేహాలను ఫోరెన్సిక్కు తరలించామన్నారు.
ఈజిప్షియన్ సెక్యూరిటీ గార్డు మృతి: మహ్బౌలాలోని ఒక ప్రైవేట్ పాఠశాల స్విమ్మింగ్ పూల్లో లభించిన ఈజిప్షియన్ సెక్యూరిటీ గార్డు శవాన్ని ఫోరెన్సిక్స్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సబంధించి దర్యాప్తు కొనసాగుతుందని, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







