24 గంటల వ్యవధిలో మూడు మృతదేహాలు లభ్యం

- September 11, 2022 , by Maagulf
24 గంటల వ్యవధిలో మూడు మృతదేహాలు లభ్యం

కువైట్ సిటీ: అనుమానాస్పద పరిస్థితుల్లో 24 గంటల వ్యవధిలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. అల్-దబయ్యా తీరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. అంతకుముందు ఫహాహీల్‌లోని బహిరంగ ప్రదేశంలో పార్క్ చేసిన కారులో గుర్తుతెలియని వ్యక్తి శవాన్ని గుర్తించామన్నారు. అలాగే అల్-ఖైరాన్ శివారులోని వాహనంలో మరో గుర్తు తెలియని యువతి శవం కనిపించిందని పోలీసులు వెల్లడించారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు భద్రతాధికారులు తెలిపారు. మరో సంఘటనలో  సెవెంత్ రింగ్ రోడ్‌లో మరో కారు ఢీకొనడంతో కువైట్ మహిళ మరణించిందని,  ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నలుగురి మృతదేహాలను ఫోరెన్సిక్‌కు తరలించామన్నారు.

ఈజిప్షియన్ సెక్యూరిటీ గార్డు మృతి: మహ్బౌలాలోని ఒక ప్రైవేట్ పాఠశాల స్విమ్మింగ్ పూల్‌లో లభించిన ఈజిప్షియన్ సెక్యూరిటీ గార్డు శవాన్ని ఫోరెన్సిక్స్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సబంధించి దర్యాప్తు కొనసాగుతుందని, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com