వాహనాల ధ్వంసం, దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్

- September 11, 2022 , by Maagulf
వాహనాల ధ్వంసం, దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్

మస్కట్:వాహనాలు ధ్వంసం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ అలి బాతియా గవర్నేట్ పరిధిలో పలు వాహనాల చోరీకి సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. చోరీకి పాల్పడే వ్యక్తులు వాహనాలను దొంగలించటం వీలుకాని సందర్భంలో ఆయా వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఫిర్యాదు అందుకు రాయల్ ఒమన్ పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై వాహనాల ధ్వంసం, చోరీ కేసులు నమోదు చేశారు. చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com