ఎలక్ట్రిక్ కార్గో ఫ్లైట్ కు లైసెన్స్ మంజూరు చేసిన యూఏఈ
- September 11, 2022
యూఏఈ: రవాణా రంగంలో సాంప్రదాయ ఇంధనాన్ని తగ్గించి గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీని పెంచాలని ప్రపంచ దేశాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. ఐతే యూఏఈ ఒక అడుగు ముందుకేసి ఎలక్ట్రిక్ కార్గో ఫ్లైట్ కు లైసెన్స్ మంజూరు చేయటం విశేషం. సరకు రవాణా కోసం ఉపయోగించి ఈ ఎయిర్ క్రాఫ్ట్ పూర్తిగా క్లీన్ ఎనర్జీ పై ఆధారపడి నడుస్తుంది. ఒక్క శాతం కూడా ఉద్గారాలను విడుదల చేయదు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ ముఖ్తోమ్ ఆధ్వర్యంలో కేబినేట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో తాత్కాలికంగా ఎలక్ట్రిక్ కార్గో ఫ్లైట్ కు లైసెన్స్ మంజూరు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం దుబాయ్ రాజు మహ్మద్ బిన్ రషీద్ ట్వీట్ చేస్తూ రవాణా రంగంలో భవిష్యత్ లో వచ్చే మార్పులకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ వినియోగం లో ఇదొక ముందడుగు అని చెప్పారు. అదే విధంగా రవాణా రంగంలో సప్లయిర్స్ కు వినియోగదారులకు ఖర్చు తగ్గుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







