ఎలక్ట్రిక్ కార్గో ఫ్లైట్ కు లైసెన్స్ మంజూరు చేసిన యూఏఈ
- September 11, 2022
యూఏఈ: రవాణా రంగంలో సాంప్రదాయ ఇంధనాన్ని తగ్గించి గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీని పెంచాలని ప్రపంచ దేశాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. ఐతే యూఏఈ ఒక అడుగు ముందుకేసి ఎలక్ట్రిక్ కార్గో ఫ్లైట్ కు లైసెన్స్ మంజూరు చేయటం విశేషం. సరకు రవాణా కోసం ఉపయోగించి ఈ ఎయిర్ క్రాఫ్ట్ పూర్తిగా క్లీన్ ఎనర్జీ పై ఆధారపడి నడుస్తుంది. ఒక్క శాతం కూడా ఉద్గారాలను విడుదల చేయదు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ ముఖ్తోమ్ ఆధ్వర్యంలో కేబినేట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో తాత్కాలికంగా ఎలక్ట్రిక్ కార్గో ఫ్లైట్ కు లైసెన్స్ మంజూరు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం దుబాయ్ రాజు మహ్మద్ బిన్ రషీద్ ట్వీట్ చేస్తూ రవాణా రంగంలో భవిష్యత్ లో వచ్చే మార్పులకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ వినియోగం లో ఇదొక ముందడుగు అని చెప్పారు. అదే విధంగా రవాణా రంగంలో సప్లయిర్స్ కు వినియోగదారులకు ఖర్చు తగ్గుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









