ప్రభుత్వ స్కూళ్ల విస్తరణ. నర్సరీల్లో కిండర్ గార్డెన్
- September 13, 2022
యూఏఈ: ప్రభుత్వ పాఠశాలలను విస్తరించాలని సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఆదేశించారు. విద్యార్థులను నేరుగా ఫస్ట్ గ్రేడుకు క్వాలఫై అయ్యే విధంగా అన్ని పాఠశాలలో కిండర్ గార్టెన్ ను నర్సరీ దశలో ప్రవేశపెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదే విధంగా అల్ మేడమ్లోని “ఖలీఫా అల్ హంజా” పాఠశాలను విస్తరించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని విద్యా స్థాయిలను ప్రవేశపెట్టాలని షార్జా పాలకుడు ఆదేశించారు. అలాగే పౌరులకు 20% తగ్గింపును ఇవ్వాలని పాఠశాల చైర్మన్ డాక్టర్ సయీద్ ముసాబా అల్ కాబీ కు సూచించారు. షార్జా ఎడ్యుకేషన్ కౌన్సిల్, షార్జా బ్రాడ్కాస్టింగ్ అథారిటీ నిర్వహించిన “డైరెక్ట్ లైన్” కార్యక్రమంలో ముహమ్మద్ అల్ ఖాసిమి పాల్గొన్నారు. ఈ సందర్భంగా "డైరెక్ట్ లైన్" కార్యక్రమం దిబ్బా అల్-హిస్న్లోని అల్ "ఖవాసిమ్ ఫోర్ట్"తోపాటు షార్జాలోని 3 పురాతన కోటలను పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రూపొందించామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!