ప్రపంచంలోనే అతిపెద్ద చరఖాని దిల్లీలో..
- April 17, 2016ప్రపంచంలోనే అతిపెద్ద చరఖాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటుచేయనున్నారు. ఎయిర్పోర్టులోని మూడో టర్మినల్ వద్ద ఈ చరఖాను పెట్టనున్నారు. భారత అహింసా విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు దీన్ని ఏర్పాటుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ చరఖా తయారీ పనులు పూర్తవగా.. త్వరలోనే దీన్ని ఎయిర్పోర్టుకు తీసుకురానున్నారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో గల ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) యూనిట్లో ఈ చరఖాను రూపొందించారు. నాలుగు టన్నుల బరువున్న ఈ చరఖాను పూర్తిగా టేకుతో తయారుచేశారు. 26 మంది వర్కర్లు, కార్పెంటర్లు కలిసి 40 రోజుల్లో దీన్ని పూర్తిచేసినట్లు కేవీఐసీ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు