బహ్రెయిన్ లో సెప్టెంబర్ 15 నుండి కొత్త పర్యావరణ చట్టం
- September 15, 2022
మనామా: సెప్టెంబర్ 15 నుండి పర్యావరణంపై 2022 చట్టం (7) అమలులోకి వస్తుందని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (SCE) ప్రకటించింది. కొత్త పర్యావరణ చట్టం ద్వారా పర్యావరణాన్ని, దాని మూలాలను కాలుష్యం నుంచి కాపాడటంతోపాటు జీవవైవిధ్యం క్షీణతకు కారణమయ్యే అన్ని కార్యకలాపాలను అడ్డుకొని పర్యావరణాన్ని రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కౌన్సిల్ పేర్కొంది. పర్యావరణ వనరులను సంరక్షించడం, బహ్రెయిన్ రాజ్యం ప్రాదేశిక సరిహద్దులలో స్థిరమైన అభివృద్ధి, జీవవైవిధ్యం లక్ష్యాలను అందించడానికి వాటిని అభివృద్ధి చేయడం కూడా చట్టం లక్ష్యంగా ఉందని కౌన్సిల్ తెలిపింది. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ శాఖల మధ్య ఫలవంతమైన సహకారం ద్వారా పర్యావరణ ముసాయిదా చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొంది. పర్యావరణ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, ఆశించిన లక్ష్యాలను సాధించడానికి మరింత సహకారం అందించాలని అన్ని సంబంధిత పార్టీలు, కంపెనీలను కౌన్సిల్ కోరింది.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









