బహ్రెయిన్ లో సెప్టెంబర్ 15 నుండి కొత్త పర్యావరణ చట్టం
- September 15, 2022
మనామా: సెప్టెంబర్ 15 నుండి పర్యావరణంపై 2022 చట్టం (7) అమలులోకి వస్తుందని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (SCE) ప్రకటించింది. కొత్త పర్యావరణ చట్టం ద్వారా పర్యావరణాన్ని, దాని మూలాలను కాలుష్యం నుంచి కాపాడటంతోపాటు జీవవైవిధ్యం క్షీణతకు కారణమయ్యే అన్ని కార్యకలాపాలను అడ్డుకొని పర్యావరణాన్ని రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కౌన్సిల్ పేర్కొంది. పర్యావరణ వనరులను సంరక్షించడం, బహ్రెయిన్ రాజ్యం ప్రాదేశిక సరిహద్దులలో స్థిరమైన అభివృద్ధి, జీవవైవిధ్యం లక్ష్యాలను అందించడానికి వాటిని అభివృద్ధి చేయడం కూడా చట్టం లక్ష్యంగా ఉందని కౌన్సిల్ తెలిపింది. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ శాఖల మధ్య ఫలవంతమైన సహకారం ద్వారా పర్యావరణ ముసాయిదా చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొంది. పర్యావరణ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, ఆశించిన లక్ష్యాలను సాధించడానికి మరింత సహకారం అందించాలని అన్ని సంబంధిత పార్టీలు, కంపెనీలను కౌన్సిల్ కోరింది.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







