బహ్రెయిన్ లో సెప్టెంబర్ 15 నుండి కొత్త పర్యావరణ చట్టం
- September 15, 2022
మనామా: సెప్టెంబర్ 15 నుండి పర్యావరణంపై 2022 చట్టం (7) అమలులోకి వస్తుందని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (SCE) ప్రకటించింది. కొత్త పర్యావరణ చట్టం ద్వారా పర్యావరణాన్ని, దాని మూలాలను కాలుష్యం నుంచి కాపాడటంతోపాటు జీవవైవిధ్యం క్షీణతకు కారణమయ్యే అన్ని కార్యకలాపాలను అడ్డుకొని పర్యావరణాన్ని రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కౌన్సిల్ పేర్కొంది. పర్యావరణ వనరులను సంరక్షించడం, బహ్రెయిన్ రాజ్యం ప్రాదేశిక సరిహద్దులలో స్థిరమైన అభివృద్ధి, జీవవైవిధ్యం లక్ష్యాలను అందించడానికి వాటిని అభివృద్ధి చేయడం కూడా చట్టం లక్ష్యంగా ఉందని కౌన్సిల్ తెలిపింది. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ శాఖల మధ్య ఫలవంతమైన సహకారం ద్వారా పర్యావరణ ముసాయిదా చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొంది. పర్యావరణ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, ఆశించిన లక్ష్యాలను సాధించడానికి మరింత సహకారం అందించాలని అన్ని సంబంధిత పార్టీలు, కంపెనీలను కౌన్సిల్ కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







