భారత్ కరోనా అప్డేట్
- September 18, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 5,664 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 4,555 మంది కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం దేశంలో 47,922 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది.రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతంగా ఉన్నట్లు చెప్పింది.వారాంతపు పాజిటివిటీ రేటు 1.79 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.రికవరీ రేటు 98.71 శాతం ఉన్నట్లు తెలిపింది.
ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,39,57,929గా ఉన్నట్లు వివరించింది. ఇప్పటికే దేశంలో వినియోగించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య మొత్తం 216.56 కోట్లు అని పేర్కొంది. వాటిలో రెండో డోసులు 94.65 కోట్లు, బూస్టర్ డోసులు 19.48 కోట్లు ఉన్నట్లు చెప్పింది. నిన్న 14,84,216 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 89.15 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. నిన్న 2,89,228 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.
తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









