ఫ్యామిలీ వీసా జీతం పరిమితి KD800కి పెంపు..!
- September 18, 2022
కువైట్: కుటుంబం/ఆధారిత వీసా (ఆర్టికల్ 22) కోసం దరఖాస్తు చేసుకోవడానికి జీతం పరిమితిని ప్రస్తుతమున్న KD 500 నుండి KD 800కి పెంచాలని అంతర్గత మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ మేరకు ఓ నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీసా ఆర్టికల్ 17, 18 (ప్రైవేట్, ప్రభుత్వం) కలిగి ఉన్న ప్రవాసులందరికీ కుటుంబం/ఆధారిత వీసా కోసం దరఖాస్తు చేయడానికి కనీసం KD 800 ప్రాథమిక జీతం అవసరం. ఇతర అదనపు ఆదాయాన్ని వీసా జారీకి పరిగణనలోకి తీసుకోరు. కువైట్లో జనాభాను నియంత్రించేందుకే కొత్త నియమాన్ని రూపొందించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోందని సమాచారం. ఈ నిర్ణయం ద్వారా అధిక ఆదాయం ఉన్న ప్రవాసులు మాత్రమే వారి కుటుంబాలను తీసుకురాగలరని, తద్వారా వారి భార్యలు స్థానిక మార్కెట్లో ఉద్యోగాల కోసం పోటీపడరని మంత్రిత్వ శాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆర్టికల్ 22 ప్రకారం ఇటీవల కువైట్లోకి ప్రవేశించిన వారందరినీ ఈ నిర్ణయం వర్తించనుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







