ఫ్యామిలీ వీసా జీతం పరిమితి KD800కి పెంపు..!
- September 18, 2022
కువైట్: కుటుంబం/ఆధారిత వీసా (ఆర్టికల్ 22) కోసం దరఖాస్తు చేసుకోవడానికి జీతం పరిమితిని ప్రస్తుతమున్న KD 500 నుండి KD 800కి పెంచాలని అంతర్గత మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ మేరకు ఓ నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీసా ఆర్టికల్ 17, 18 (ప్రైవేట్, ప్రభుత్వం) కలిగి ఉన్న ప్రవాసులందరికీ కుటుంబం/ఆధారిత వీసా కోసం దరఖాస్తు చేయడానికి కనీసం KD 800 ప్రాథమిక జీతం అవసరం. ఇతర అదనపు ఆదాయాన్ని వీసా జారీకి పరిగణనలోకి తీసుకోరు. కువైట్లో జనాభాను నియంత్రించేందుకే కొత్త నియమాన్ని రూపొందించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోందని సమాచారం. ఈ నిర్ణయం ద్వారా అధిక ఆదాయం ఉన్న ప్రవాసులు మాత్రమే వారి కుటుంబాలను తీసుకురాగలరని, తద్వారా వారి భార్యలు స్థానిక మార్కెట్లో ఉద్యోగాల కోసం పోటీపడరని మంత్రిత్వ శాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆర్టికల్ 22 ప్రకారం ఇటీవల కువైట్లోకి ప్రవేశించిన వారందరినీ ఈ నిర్ణయం వర్తించనుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







