ఫ్యామిలీ వీసా జీతం పరిమితి KD800కి పెంపు..!
- September 18, 2022
కువైట్: కుటుంబం/ఆధారిత వీసా (ఆర్టికల్ 22) కోసం దరఖాస్తు చేసుకోవడానికి జీతం పరిమితిని ప్రస్తుతమున్న KD 500 నుండి KD 800కి పెంచాలని అంతర్గత మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ మేరకు ఓ నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీసా ఆర్టికల్ 17, 18 (ప్రైవేట్, ప్రభుత్వం) కలిగి ఉన్న ప్రవాసులందరికీ కుటుంబం/ఆధారిత వీసా కోసం దరఖాస్తు చేయడానికి కనీసం KD 800 ప్రాథమిక జీతం అవసరం. ఇతర అదనపు ఆదాయాన్ని వీసా జారీకి పరిగణనలోకి తీసుకోరు. కువైట్లో జనాభాను నియంత్రించేందుకే కొత్త నియమాన్ని రూపొందించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోందని సమాచారం. ఈ నిర్ణయం ద్వారా అధిక ఆదాయం ఉన్న ప్రవాసులు మాత్రమే వారి కుటుంబాలను తీసుకురాగలరని, తద్వారా వారి భార్యలు స్థానిక మార్కెట్లో ఉద్యోగాల కోసం పోటీపడరని మంత్రిత్వ శాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆర్టికల్ 22 ప్రకారం ఇటీవల కువైట్లోకి ప్రవేశించిన వారందరినీ ఈ నిర్ణయం వర్తించనుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి.. తీవ్రంగా ఖండించిన యూఏఈ
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా









