బ్రిటన్ రాణి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లండన్ చేరుకున్న దుబాయ్ రాజు
- September 19, 2022
లండన్ : బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ లండన్ చేరుకున్నారు. ఆదివారం లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్లో కింగ్ చార్లెస్ -3తో సమావేశమై క్వీన్ ఎలిజబెత్ మరణానికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా యూఏఈ, యూకే మధ్య బలోపేతమైన సంబంధాల కోసం క్వీన్ ఎలిజిబెత్ చేసిన కృషిని కింగ్ చార్లెస్ తో పంచుకున్నారు. ఈ సమావేశంలో రాజుతో పాటు యూఏఈ అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి రీమ్ అల్-హషిమీ కూడా పాల్గొన్నారు. అటు వెస్ట్మిన్స్టర్ అబ్బేలో సోమవారం క్వీన్ ఎలిజిబెత్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు అన్ని ప్రపంచ దేశాల అధినేత లు వస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంది ప్రపంచ అధినేతలు ఒక్క చోట సమావేశం కావటం ఇదే మొదటిసారి కానుంది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







