బ్రిటన్ రాణి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లండన్ చేరుకున్న దుబాయ్ రాజు
- September 19, 2022
లండన్ : బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ లండన్ చేరుకున్నారు. ఆదివారం లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్లో కింగ్ చార్లెస్ -3తో సమావేశమై క్వీన్ ఎలిజబెత్ మరణానికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా యూఏఈ, యూకే మధ్య బలోపేతమైన సంబంధాల కోసం క్వీన్ ఎలిజిబెత్ చేసిన కృషిని కింగ్ చార్లెస్ తో పంచుకున్నారు. ఈ సమావేశంలో రాజుతో పాటు యూఏఈ అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి రీమ్ అల్-హషిమీ కూడా పాల్గొన్నారు. అటు వెస్ట్మిన్స్టర్ అబ్బేలో సోమవారం క్వీన్ ఎలిజిబెత్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు అన్ని ప్రపంచ దేశాల అధినేత లు వస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంది ప్రపంచ అధినేతలు ఒక్క చోట సమావేశం కావటం ఇదే మొదటిసారి కానుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









