బ్రిటన్ రాణి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లండన్ చేరుకున్న దుబాయ్ రాజు

- September 19, 2022 , by Maagulf
బ్రిటన్ రాణి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లండన్ చేరుకున్న దుబాయ్ రాజు

లండన్ :  బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ లండన్ చేరుకున్నారు.  ఆదివారం లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్ -3తో సమావేశమై క్వీన్ ఎలిజబెత్  మరణానికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా యూఏఈ, యూకే మధ్య  బలోపేతమైన సంబంధాల కోసం క్వీన్ ఎలిజిబెత్ చేసిన కృషిని కింగ్ చార్లెస్ తో పంచుకున్నారు. ఈ సమావేశంలో రాజుతో పాటు యూఏఈ అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి రీమ్ అల్-హషిమీ కూడా పాల్గొన్నారు. అటు వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో సోమవారం క్వీన్ ఎలిజిబెత్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు అన్ని ప్రపంచ దేశాల అధినేత లు వస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంది ప్రపంచ అధినేతలు ఒక్క చోట సమావేశం కావటం ఇదే మొదటిసారి కానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com