మొబైల్ ఫోన్ దుర్వినియోగానికి ఏడాది జైలు, SR500,000 జరిమానా

- September 19, 2022 , by Maagulf
మొబైల్ ఫోన్ దుర్వినియోగానికి ఏడాది జైలు, SR500,000 జరిమానా

రియాద్: కెమెరాతో కూడిన మొబైల్ ఫోన్‌లను దుర్వినియోగం చేయడం లేదా అలాంటి వాటి ద్వారా వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. వ్యక్తిగత సమాచార గోప్యత ఉల్లంఘన కేసులో నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉందని, తీవ్రమైన సమాచార నేరాలలో ఇది ఒకటని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, SR 500,000 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. దీనితోపాటు నేరం చేయడానికి ఉపయోగించిన పరికరాలను జప్తు చేయడం జరుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com