నజీజ్ పోర్టల్ అప్గ్రేడ్.. కొత్తగా మరో 10 సర్వీసులు
- September 20, 2022
సౌదీ: నజీజ్ పోర్టల్ అప్గ్రేడ్ అయింది. కొత్తగా మరో 10 సర్వీసులు ఖాతాదారులకు అందుబాటులోకి వచ్చాయి. 10 న్యాయపరమైన ఇ-సర్వీసులు, ఐదు ఇంటరాక్టివ్ ఫీచర్లను జోడించడం ద్వారా Najiz.sa పోర్టల్ను అప్గ్రేడ్ చేసినట్లు సౌదీ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ (MoJ) ప్రకటించింది. ఖాతాదారులకు సంబంధిత విధానాలు, షెడ్యూల్ చేసిన సెషన్లను వెంటనే వీక్షించడానికి కొత్త సర్వీసులు వీలు కల్పిస్తుందని తెలిపింది. అప్గ్రేడ్ ద్వారా క్లయింట్లు వారి కేసులపై తాజా అప్డేట్లను వెంటనే అందుకోవచ్చు. దీంతోపాటు ఫైలింగ్ల కోసం మరింత సులువుగా సెర్చింగ్ చేయడంతోపాటు తమ కేసుల తీర్పులను సులువుగా తెలుసుకునే విధంగా పోర్టల్ లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. న్యాయస్థానాలు, నోటరైజేషన్ను కవర్ చేసే 140 కంటే ఎక్కువ న్యాయపరమైన ఇ-సేవలను నజీజ్ పోర్టల్ అందిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం
- మార్కెట్ లోకి రూ.500 ప్లాస్టిక్ నోట్లు? RBI క్లారిటీ
- 50 ఏళ్ల వయసు వచ్చే వరకు రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ!
- ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ప్రపంచ రికార్డు సృష్టించిన మేఘా ఇంజనీరింగ్ అద్భుతం..
- మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం: సీఎం రేవంత్
- వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..కూటమి ప్రభుత్వం పై విమర్శలు
- యూఏఈ లాటరీ గెలుచున్న సెక్యూరిటీ గార్డు









