మ్యాన్హోల్లో పడ్డ కార్మికుడిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
- September 25, 2022
కువైట్: సభాన్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం మురుగునీటి మ్యాన్హోల్లో పడిన కార్మికుడిని సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ సిబ్బంది వెలికితీశారని జనరల్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా విభాగం తెలిపింది. వర్షాకాలానికి సన్నాహకంగా ఆరో రింగ్రోడ్డులోని సభాన్ ప్రాంతంలో ఉన్న మ్యాన్హోల్ మురుగునీటి వ్యవస్థను శుభ్రం చేస్తుండగా.. ఇద్దరు కార్మికులు అందులో పడిపోయినట్లు కేంద్ర ఆపరేషన్స్ విభాగానికి సమాచారం వచ్చిందన్నారు. వెంటనే అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, మ్యాన్హోల్ వెలుపల ఉన్న కార్మికులలో ఒకరు అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి ప్రథమ చికిత్స అందించారని తెలిపారు. అలాగే మ్యాన్హోల్లో ఉన్న మరో వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసి ఫోరెన్సిక్కు అప్పగించినట్లు జనరల్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







