భారత రాయబారితో బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ కార్యదర్శి మీటింగ్
- September 26, 2022
మనామా : బహ్రెయిన్ లోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవతో బహ్రెయిన్ పాస్ పోర్ట్, రెసిడెన్సీ, ఇంటీరియర్ వ్యవహారాల శాఖ కార్యదర్శి షేక్ హేషమ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలు, పలు రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలను చర్చించారు. రెండు దేశాలు మరింత మెరుగైన సంబంధాల కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. బహ్రెయిన్ లో భారతీయుల సమస్యలు, పాస్ పోర్ట్ అంశాలు, రెసిడెన్షియల్ వ్యవహారాలను భారత రాయబారి ప్రస్తావించారు. ఈ అంశంలో మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందన్నారు. భారత్ తో సంబంధాల విషయంలో అత్యంత ప్రాధాన్యమిస్తున్న బహ్రెయిన్ ప్రయత్నాలకు ఆ దేశానికి అభినందనలు తెలుపుతున్నట్లు భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ప్రకటించారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









