భారత రాయబారితో బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ కార్యదర్శి మీటింగ్

- September 26, 2022 , by Maagulf
భారత రాయబారితో  బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ కార్యదర్శి మీటింగ్

మనామా : బహ్రెయిన్ లోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవతో బహ్రెయిన్ పాస్ పోర్ట్, రెసిడెన్సీ, ఇంటీరియర్ వ్యవహారాల శాఖ కార్యదర్శి షేక్ హేషమ్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ ఖలీఫా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలు, పలు రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలను చర్చించారు. రెండు దేశాలు  మరింత మెరుగైన సంబంధాల కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. బహ్రెయిన్ లో భారతీయుల సమస్యలు, పాస్ పోర్ట్ అంశాలు, రెసిడెన్షియల్ వ్యవహారాలను భారత రాయబారి ప్రస్తావించారు. ఈ అంశంలో మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందన్నారు. భారత్ తో సంబంధాల విషయంలో అత్యంత ప్రాధాన్యమిస్తున్న బహ్రెయిన్ ప్రయత్నాలకు ఆ దేశానికి అభినందనలు తెలుపుతున్నట్లు భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com