భారత్ కరోనా అప్డేట్

- September 26, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భార‌త్‌లో కరోనా రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 4129 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,45,72,243కు చేరాయి. ఇందులో 4,40,00,298 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,530 మంది కరోనా కాటుకు బలయ్యారు. మరో 43,415 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఏడుగురు మృతిచెందగా 4688 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.51 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.72 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 217.68 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com