యూఏఈలో ఈ తప్పు చేస్తే Dh20,000 జరిమానా.. రెండేళ్ల జైలు శిక్ష
- September 28, 2022
యూఏఈ: యూఏఈలో నివాసితులు, ప్రవాసులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. విలువైన వస్తువులు లేదా భారీ మొత్తంలో నగదు దొరికినప్పుడు వాటిని 48 గంటలలోపు సమీపంలోని పోలీస్ స్టేషన్లో అప్పగించాలి. అలా కాకుండా తమతో పాటు ఉంచుకుంటే అది నేరంగా పరిగణించడం జరుగుతుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. దీనికిగాను 20వేల దిర్హాములు జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపింది. 2021లో తీసుకొచ్చిన ఫెడరల్ డీక్రీ నం.31లోని అర్టికల్ 454 ప్రకారం ఇలా వేరే వాళ్లకు చెందిన నగదు లేదా ఖరీదైన వస్తువులను దాచుకునే వ్యక్తికి ఈ శిక్షను విధించడం జరుగుతుందని పేర్కొంది. అందుకే యూఏఈలోని ప్రవాసులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేనిపక్షంలో భారీ జరిమానాతో పాటు రెండేళ్లు జైలు కెళ్లాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!