పిల్లర్ను ఢీకొన్న వాహనం.. ఇద్దరు మృతి
- September 28, 2022
అబుధాబి: క్లీవ్ల్యాండ్ క్లినిక్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న కాంక్రీట్ పిల్లర్ను ఓ వాహనం బలంగా ఢీకొన్నది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు అబుధాబి పోలీసుల ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ తెలిపింది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపుతప్పి పిల్లర్ను ఢీకొట్టిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు.. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల వివరాలను అధికారులు వెల్లడించలేదు. మృతుల కుటుంబాలకు అబుదాబి పోలీసులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల