క్లాస్ రూంలో విద్యార్థుల గొడవ.. విద్యాశాఖ సీరియస్
- September 30, 2022సౌదీ: జజాన్లోని ఒక పబ్లిక్ సెకండరీ పాఠశాలలో తరగతి గదిలో క్లాస్ టీచర్ సమక్షంలోనే ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు విద్యా శాఖ తెలిపింది. మంగళవారం ఒక పబ్లిక్ సెకండరీ పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగిందని, వారిలో ఒకరికి గాయాలయ్యాయని జజాన్ విద్యా శాఖ ప్రతినిధి రాజా అల్-అట్టాస్ ధృవీకరించారు. జజాన్ రీజియన్లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెంటనే ఘటనకు గల కారణాలపై విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిందన్నారు. సంఘటన జరిగిన వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించారని, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విద్యార్థి అదే రోజు ఆస్పత్రి నుంచి ఇంటికి పోయినట్లు అల్-అట్టాస్ తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ