క్లాస్ రూంలో విద్యార్థుల గొడవ.. విద్యాశాఖ సీరియస్
- September 30, 2022
సౌదీ: జజాన్లోని ఒక పబ్లిక్ సెకండరీ పాఠశాలలో తరగతి గదిలో క్లాస్ టీచర్ సమక్షంలోనే ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు విద్యా శాఖ తెలిపింది. మంగళవారం ఒక పబ్లిక్ సెకండరీ పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగిందని, వారిలో ఒకరికి గాయాలయ్యాయని జజాన్ విద్యా శాఖ ప్రతినిధి రాజా అల్-అట్టాస్ ధృవీకరించారు. జజాన్ రీజియన్లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెంటనే ఘటనకు గల కారణాలపై విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిందన్నారు. సంఘటన జరిగిన వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించారని, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విద్యార్థి అదే రోజు ఆస్పత్రి నుంచి ఇంటికి పోయినట్లు అల్-అట్టాస్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









