క్లాస్ రూంలో విద్యార్థుల గొడవ.. విద్యాశాఖ సీరియస్
- September 30, 2022
సౌదీ: జజాన్లోని ఒక పబ్లిక్ సెకండరీ పాఠశాలలో తరగతి గదిలో క్లాస్ టీచర్ సమక్షంలోనే ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు విద్యా శాఖ తెలిపింది. మంగళవారం ఒక పబ్లిక్ సెకండరీ పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగిందని, వారిలో ఒకరికి గాయాలయ్యాయని జజాన్ విద్యా శాఖ ప్రతినిధి రాజా అల్-అట్టాస్ ధృవీకరించారు. జజాన్ రీజియన్లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెంటనే ఘటనకు గల కారణాలపై విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిందన్నారు. సంఘటన జరిగిన వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించారని, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విద్యార్థి అదే రోజు ఆస్పత్రి నుంచి ఇంటికి పోయినట్లు అల్-అట్టాస్ తెలిపారు.
తాజా వార్తలు
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం
- సాహిత్యం సమాజ జాగృతికి శక్తివంతమైన సాధనం: డాక్టర్ నందిని సిధారెడ్డి
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!









