అవును.! వాళ్లిద్దరూ కలిసిపోతున్నారా?
- October 01, 2022
చెన్నై:సూపర్ స్టార్ రజనీకాంత్ ముద్దుల తనయ సౌందర్య, తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసింతే. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ, ‘ఔను మేమిద్దరం విడిపోతున్నాం..’ అంటూ ఈ జంట క్లారిటీ ఇచ్చేసిన సంగతి కూడా తెలిసిందే.
అయితే, విడాకుల కోసం ప్రకటన చేశారు కానీ, విడాకుల కోసం ఇంతవరకూ ఈ జంట అప్లై చేసింది లేదట. ఇరు కుటుంబాల పెద్దలూ వీరిద్దరి మధ్యా గొడవలు సద్దుమనిగేలా చేసి, ఇద్దరినీ కలిపేందుకు ట్రై చేస్తున్నారట. కుటుంబ సభ్యుల సలహా మేరకు, తమ ఇద్దరి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఈ స్టార్ కపుల్ తమ అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇకపై కలిసే వుండాలనీ, తమ మధ్య అభిప్రాయ బేధాలను సయోధ్యతో చక్కదిద్దుకోవాలనీ నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దాదాపు 18 ఏళ్ల వివాహ బంధం వీళ్లది. అంతటి సుదీర్ఘమైన అనుబంధాన్ని అనవరసరమైన అభిప్రాయ బేధాల కారణంగా రద్దు చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదనీ, ఏదైనా వుంటే, కూర్చొని చర్చించుకుని గొడవలు సద్దుమనిగేలా చేసుకోవాలని ఇటు రజనీకాంత్, అటు ధనుష్ తండ్రి కసూరి రాజా అర్ధమయ్యేలా చెప్పడంతో, ధనుష్, సౌందర్య మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఈ జంట విడాకుల ఆలోచనను విరమించి మళ్లీ కలిసిపోనున్నారనీ ప్రచారం జరుగుతోంది. విడాకుల ప్రచారం నిజమైనట్లే, ఈ కలిసిపోవడం అనే ప్రచారం కూడా నిజం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!
- బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి
- మలేషియాలో ఏపీ వాసి మృతి
- తెలంగాణ: రేపే మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక
- పాక్ను చిత్తుగా ఓడించిన భారత్..
- తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!









