అవును.! వాళ్లిద్దరూ కలిసిపోతున్నారా?
- October 01, 2022
చెన్నై:సూపర్ స్టార్ రజనీకాంత్ ముద్దుల తనయ సౌందర్య, తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసింతే. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ, ‘ఔను మేమిద్దరం విడిపోతున్నాం..’ అంటూ ఈ జంట క్లారిటీ ఇచ్చేసిన సంగతి కూడా తెలిసిందే.
అయితే, విడాకుల కోసం ప్రకటన చేశారు కానీ, విడాకుల కోసం ఇంతవరకూ ఈ జంట అప్లై చేసింది లేదట. ఇరు కుటుంబాల పెద్దలూ వీరిద్దరి మధ్యా గొడవలు సద్దుమనిగేలా చేసి, ఇద్దరినీ కలిపేందుకు ట్రై చేస్తున్నారట. కుటుంబ సభ్యుల సలహా మేరకు, తమ ఇద్దరి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఈ స్టార్ కపుల్ తమ అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇకపై కలిసే వుండాలనీ, తమ మధ్య అభిప్రాయ బేధాలను సయోధ్యతో చక్కదిద్దుకోవాలనీ నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దాదాపు 18 ఏళ్ల వివాహ బంధం వీళ్లది. అంతటి సుదీర్ఘమైన అనుబంధాన్ని అనవరసరమైన అభిప్రాయ బేధాల కారణంగా రద్దు చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదనీ, ఏదైనా వుంటే, కూర్చొని చర్చించుకుని గొడవలు సద్దుమనిగేలా చేసుకోవాలని ఇటు రజనీకాంత్, అటు ధనుష్ తండ్రి కసూరి రాజా అర్ధమయ్యేలా చెప్పడంతో, ధనుష్, సౌందర్య మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఈ జంట విడాకుల ఆలోచనను విరమించి మళ్లీ కలిసిపోనున్నారనీ ప్రచారం జరుగుతోంది. విడాకుల ప్రచారం నిజమైనట్లే, ఈ కలిసిపోవడం అనే ప్రచారం కూడా నిజం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







