అవును.! వాళ్లిద్దరూ కలిసిపోతున్నారా?
- October 01, 2022
చెన్నై:సూపర్ స్టార్ రజనీకాంత్ ముద్దుల తనయ సౌందర్య, తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసింతే. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ, ‘ఔను మేమిద్దరం విడిపోతున్నాం..’ అంటూ ఈ జంట క్లారిటీ ఇచ్చేసిన సంగతి కూడా తెలిసిందే.
అయితే, విడాకుల కోసం ప్రకటన చేశారు కానీ, విడాకుల కోసం ఇంతవరకూ ఈ జంట అప్లై చేసింది లేదట. ఇరు కుటుంబాల పెద్దలూ వీరిద్దరి మధ్యా గొడవలు సద్దుమనిగేలా చేసి, ఇద్దరినీ కలిపేందుకు ట్రై చేస్తున్నారట. కుటుంబ సభ్యుల సలహా మేరకు, తమ ఇద్దరి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఈ స్టార్ కపుల్ తమ అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇకపై కలిసే వుండాలనీ, తమ మధ్య అభిప్రాయ బేధాలను సయోధ్యతో చక్కదిద్దుకోవాలనీ నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దాదాపు 18 ఏళ్ల వివాహ బంధం వీళ్లది. అంతటి సుదీర్ఘమైన అనుబంధాన్ని అనవరసరమైన అభిప్రాయ బేధాల కారణంగా రద్దు చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదనీ, ఏదైనా వుంటే, కూర్చొని చర్చించుకుని గొడవలు సద్దుమనిగేలా చేసుకోవాలని ఇటు రజనీకాంత్, అటు ధనుష్ తండ్రి కసూరి రాజా అర్ధమయ్యేలా చెప్పడంతో, ధనుష్, సౌందర్య మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఈ జంట విడాకుల ఆలోచనను విరమించి మళ్లీ కలిసిపోనున్నారనీ ప్రచారం జరుగుతోంది. విడాకుల ప్రచారం నిజమైనట్లే, ఈ కలిసిపోవడం అనే ప్రచారం కూడా నిజం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









