భారత్ కరోనా అప్డేట్

- October 02, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భార‌త్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 3,375 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 37,444 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. దేశంలో రికవరీ రేటు 98.73 శాతంగా ఉందని చెప్పింది. నిన్న కరోనా నుంచి 4,206 మంది కోలుకున్నారని తెలిపింది. ఇప్పటివరకు కరోను నుంచి కోలుకున్న కేసులు 4,40,28,370గా ఉన్నాయని పేర్కొంది.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉన్నట్లు చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.35 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 218.75 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారని తెలిపింది. వాటిలో రెండో డోసుల సంఖ్య 94.87 కోట్లుగా ఉందని పేర్కొంది. బూస్టర్ డోసుల సంఖ్య 21.39 కోట్లుగా ఉందని తెలిపింది. నిన్న 6,90,194 డోసులు వేశారని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 89.56 కోట్ల కరోనా పరీక్షలు చేశారని తెలిపింది. నిన్న 2,64,127 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com