మలేషియా: టిఆర్ఎస్ ఎం.ఎల్.ఏ తో మీట్ & గ్రీట్ కార్యక్రమం
- October 02, 2022
కౌలాలంపూర్: తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ సందర్బంగా మలేషియా లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తుంగతుర్తి శాసన సభ్యులు గాదారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మలేషియాలో ఇంత ఘనంగా బతుకమ్మ సంబరాలను జరుపుతున్న సభ్యులను అభినందించారు.
మరుసటిరోజు ఎం.ఎల్.ఏ తెరాస మలేషియా సభ్యులతో అల్పాహార విందులో పాల్గొన్నారు. మలేషియా తెరాస అధ్యక్షులు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిపిన వివిధ కార్యక్రమాలను కొనియాడారు.ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ల విషయంలో తెరాస మలేషియా చూపిన చొరవను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి సందీప్ కుమార్ లగిశెట్టి, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సత్యనారాయణరావ్ నడిపెల్లి, నవీన్ గౌడ్ పంజాల, హరీష్ గుడిపాటి, రవిందర్ రెడ్డి మరియు ఇతర సభ్యులు శ్యామ్, సంపత్ రెడ్డి, పూర్ణ చందర్ రావు, కిషోర్ పాల్గొనడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!







