మలేషియా: టిఆర్ఎస్ ఎం.ఎల్.ఏ తో మీట్ & గ్రీట్ కార్యక్రమం
- October 02, 2022
కౌలాలంపూర్: తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ సందర్బంగా మలేషియా లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తుంగతుర్తి శాసన సభ్యులు గాదారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మలేషియాలో ఇంత ఘనంగా బతుకమ్మ సంబరాలను జరుపుతున్న సభ్యులను అభినందించారు.
మరుసటిరోజు ఎం.ఎల్.ఏ తెరాస మలేషియా సభ్యులతో అల్పాహార విందులో పాల్గొన్నారు. మలేషియా తెరాస అధ్యక్షులు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిపిన వివిధ కార్యక్రమాలను కొనియాడారు.ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ల విషయంలో తెరాస మలేషియా చూపిన చొరవను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి సందీప్ కుమార్ లగిశెట్టి, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సత్యనారాయణరావ్ నడిపెల్లి, నవీన్ గౌడ్ పంజాల, హరీష్ గుడిపాటి, రవిందర్ రెడ్డి మరియు ఇతర సభ్యులు శ్యామ్, సంపత్ రెడ్డి, పూర్ణ చందర్ రావు, కిషోర్ పాల్గొనడం జరిగింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









