సైబర్ సెక్యూరిటీపై ప్రచారాన్ని ప్రారంభించిన సౌదీ
- October 02, 2022
రియాద్: జాతీయ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ క్యాంపెయిన్ను ప్రారంభించినట్లు నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ(NCA) తెలిపింది. ఇది జాతీయ భద్రతను పరిరక్షించడంతోపాటు సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచుతుందన్నారు. జాతీయ అధికారుల కోసం 12 సెషన్లు, సైబర్ సెక్యూరిటీపై అవగాహన కోసం నాలుగు అథారిటీల ప్రధాన కార్యాలయాల్లో మొబైల్ ఎగ్జిబిషన్లు, “లా తఫ్తా మజలాన్” అనే అవగాహన పెంచే ప్రోగ్రాంతో సహా సైబర్ సెక్యూరిటీ గురించి అవగాహన పెంచడానికి భౌతిక, డిజిటల్ ఈవెంట్లను ప్రచారంలో భాగంగా నిర్వహించనున్నట్లు NCA పేర్కొంది. ఈ ప్రచారం సైబర్ సెక్యూరిటీ పట్ల అవగాహన కల్పిచడంతోపాటు ఆన్లైన్ బెదిరింపులను తగ్గించడంలో సహాయపడుతుందన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









