అక్టోబర్ 4న దుబాయ్లో హిందూ దేవాలయం ప్రారంభం...
- October 03, 2022
యూఏఈ: దుబాయ్లో కొత్త హిందూ దేవాలయం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఆలయాన్ని అక్టోబర్ 4న ప్రారంభించనున్నారు.అయితే అక్టోబర్ 4వ తేదీన ఆలయం సందర్శనం కేవలం ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే అనీ,అక్టోబర్ 5వ తారీఖున ఆలయ ప్రవేశానికి రిజిస్ట్రేషన్/ఆహ్వానం అక్కర్లేదని ప్రజలు గమనించవలసిందిగా ఆలయ కమిటీ కోరింది.ఈ ఆలయంలో 16 మంది హిందూ దేవతలను ప్రతిష్టించారు.ఆలయంలో ప్రజలు వివాహాలు, ప్రైవేట్ ఈవెంట్లను నిర్వహించడానికి సౌకర్యాలు ఉన్నాయి.మరింత సమాచారం కోసం ఆలయ వెబ్సైట్ http://hindutempledubai.com ను సందర్శించాలని ఆలయ వర్గాలు తెలిపాయి. జబెల్ అలీ ప్రాంతంలో దుబాయ్ కారిడార్ ఆఫ్ టాలరెన్స్లో ఈ ఆలయం ఉంది.ఈ ప్రాంతంలో సిక్కు గురుద్వారాతోపాటు క్రిస్టియన్ వర్గాల కోసం అనేక చర్చిలు కూడా ఉన్నాయి.
హిందూ దేవాలయంలో ప్రత్యేకతలు
• ఆలయంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ, నాలెడ్జ్ సెంటర్లలో పెద్దసైజు LCD స్క్రీన్లను ఇన్స్టాల్ చేశారు.
• ఆలయ తలుపులు వాల్నట్తో తయారు చేశారు.
• దక్షిణ భారత దేవతలను నల్ల రాతి నుండి సేకరించారు.
• ఆలయంలో గణేశుడు, కృష్ణుడు, మహాలక్ష్మి, గురువాయూరప్పన్, అయ్యప్పన్ మొదలైన 15 ఇతర దేవతలతో పాటు శివుడు ప్రధాన దేవతలుగా పూజలు అందుకోనున్నారు.
• ఆలయం లోపల సిక్కుల పవిత్ర గ్రంథమైన శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
• ఆలయంలో నిత్యం పూజలు నిర్వహించేందుకు ఎనిమిది మంది పూజారులను శాశ్వతంగా నియమించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







