అక్టోబర్ 4న దుబాయ్లో హిందూ దేవాలయం ప్రారంభం...
- October 03, 2022
యూఏఈ: దుబాయ్లో కొత్త హిందూ దేవాలయం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఆలయాన్ని అక్టోబర్ 4న ప్రారంభించనున్నారు.అయితే అక్టోబర్ 4వ తేదీన ఆలయం సందర్శనం కేవలం ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే అనీ,అక్టోబర్ 5వ తారీఖున ఆలయ ప్రవేశానికి రిజిస్ట్రేషన్/ఆహ్వానం అక్కర్లేదని ప్రజలు గమనించవలసిందిగా ఆలయ కమిటీ కోరింది.ఈ ఆలయంలో 16 మంది హిందూ దేవతలను ప్రతిష్టించారు.ఆలయంలో ప్రజలు వివాహాలు, ప్రైవేట్ ఈవెంట్లను నిర్వహించడానికి సౌకర్యాలు ఉన్నాయి.మరింత సమాచారం కోసం ఆలయ వెబ్సైట్ http://hindutempledubai.com ను సందర్శించాలని ఆలయ వర్గాలు తెలిపాయి. జబెల్ అలీ ప్రాంతంలో దుబాయ్ కారిడార్ ఆఫ్ టాలరెన్స్లో ఈ ఆలయం ఉంది.ఈ ప్రాంతంలో సిక్కు గురుద్వారాతోపాటు క్రిస్టియన్ వర్గాల కోసం అనేక చర్చిలు కూడా ఉన్నాయి.
హిందూ దేవాలయంలో ప్రత్యేకతలు
• ఆలయంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ, నాలెడ్జ్ సెంటర్లలో పెద్దసైజు LCD స్క్రీన్లను ఇన్స్టాల్ చేశారు.
• ఆలయ తలుపులు వాల్నట్తో తయారు చేశారు.
• దక్షిణ భారత దేవతలను నల్ల రాతి నుండి సేకరించారు.
• ఆలయంలో గణేశుడు, కృష్ణుడు, మహాలక్ష్మి, గురువాయూరప్పన్, అయ్యప్పన్ మొదలైన 15 ఇతర దేవతలతో పాటు శివుడు ప్రధాన దేవతలుగా పూజలు అందుకోనున్నారు.
• ఆలయం లోపల సిక్కుల పవిత్ర గ్రంథమైన శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
• ఆలయంలో నిత్యం పూజలు నిర్వహించేందుకు ఎనిమిది మంది పూజారులను శాశ్వతంగా నియమించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







