అక్టోబర్ 4న దుబాయ్లో హిందూ దేవాలయం ప్రారంభం...
- October 03, 2022
యూఏఈ: దుబాయ్లో కొత్త హిందూ దేవాలయం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఆలయాన్ని అక్టోబర్ 4న ప్రారంభించనున్నారు.అయితే అక్టోబర్ 4వ తేదీన ఆలయం సందర్శనం కేవలం ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే అనీ,అక్టోబర్ 5వ తారీఖున ఆలయ ప్రవేశానికి రిజిస్ట్రేషన్/ఆహ్వానం అక్కర్లేదని ప్రజలు గమనించవలసిందిగా ఆలయ కమిటీ కోరింది.ఈ ఆలయంలో 16 మంది హిందూ దేవతలను ప్రతిష్టించారు.ఆలయంలో ప్రజలు వివాహాలు, ప్రైవేట్ ఈవెంట్లను నిర్వహించడానికి సౌకర్యాలు ఉన్నాయి.మరింత సమాచారం కోసం ఆలయ వెబ్సైట్ http://hindutempledubai.com ను సందర్శించాలని ఆలయ వర్గాలు తెలిపాయి. జబెల్ అలీ ప్రాంతంలో దుబాయ్ కారిడార్ ఆఫ్ టాలరెన్స్లో ఈ ఆలయం ఉంది.ఈ ప్రాంతంలో సిక్కు గురుద్వారాతోపాటు క్రిస్టియన్ వర్గాల కోసం అనేక చర్చిలు కూడా ఉన్నాయి.
హిందూ దేవాలయంలో ప్రత్యేకతలు
• ఆలయంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ, నాలెడ్జ్ సెంటర్లలో పెద్దసైజు LCD స్క్రీన్లను ఇన్స్టాల్ చేశారు.
• ఆలయ తలుపులు వాల్నట్తో తయారు చేశారు.
• దక్షిణ భారత దేవతలను నల్ల రాతి నుండి సేకరించారు.
• ఆలయంలో గణేశుడు, కృష్ణుడు, మహాలక్ష్మి, గురువాయూరప్పన్, అయ్యప్పన్ మొదలైన 15 ఇతర దేవతలతో పాటు శివుడు ప్రధాన దేవతలుగా పూజలు అందుకోనున్నారు.
• ఆలయం లోపల సిక్కుల పవిత్ర గ్రంథమైన శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
• ఆలయంలో నిత్యం పూజలు నిర్వహించేందుకు ఎనిమిది మంది పూజారులను శాశ్వతంగా నియమించారు.
తాజా వార్తలు
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!









