అక్టోబర్ 4న దుబాయ్లో హిందూ దేవాలయం ప్రారంభం...
- October 03, 2022
యూఏఈ: దుబాయ్లో కొత్త హిందూ దేవాలయం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఆలయాన్ని అక్టోబర్ 4న ప్రారంభించనున్నారు.అయితే అక్టోబర్ 4వ తేదీన ఆలయం సందర్శనం కేవలం ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే అనీ,అక్టోబర్ 5వ తారీఖున ఆలయ ప్రవేశానికి రిజిస్ట్రేషన్/ఆహ్వానం అక్కర్లేదని ప్రజలు గమనించవలసిందిగా ఆలయ కమిటీ కోరింది.ఈ ఆలయంలో 16 మంది హిందూ దేవతలను ప్రతిష్టించారు.ఆలయంలో ప్రజలు వివాహాలు, ప్రైవేట్ ఈవెంట్లను నిర్వహించడానికి సౌకర్యాలు ఉన్నాయి.మరింత సమాచారం కోసం ఆలయ వెబ్సైట్ http://hindutempledubai.com ను సందర్శించాలని ఆలయ వర్గాలు తెలిపాయి. జబెల్ అలీ ప్రాంతంలో దుబాయ్ కారిడార్ ఆఫ్ టాలరెన్స్లో ఈ ఆలయం ఉంది.ఈ ప్రాంతంలో సిక్కు గురుద్వారాతోపాటు క్రిస్టియన్ వర్గాల కోసం అనేక చర్చిలు కూడా ఉన్నాయి.
హిందూ దేవాలయంలో ప్రత్యేకతలు
• ఆలయంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ, నాలెడ్జ్ సెంటర్లలో పెద్దసైజు LCD స్క్రీన్లను ఇన్స్టాల్ చేశారు.
• ఆలయ తలుపులు వాల్నట్తో తయారు చేశారు.
• దక్షిణ భారత దేవతలను నల్ల రాతి నుండి సేకరించారు.
• ఆలయంలో గణేశుడు, కృష్ణుడు, మహాలక్ష్మి, గురువాయూరప్పన్, అయ్యప్పన్ మొదలైన 15 ఇతర దేవతలతో పాటు శివుడు ప్రధాన దేవతలుగా పూజలు అందుకోనున్నారు.
• ఆలయం లోపల సిక్కుల పవిత్ర గ్రంథమైన శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
• ఆలయంలో నిత్యం పూజలు నిర్వహించేందుకు ఎనిమిది మంది పూజారులను శాశ్వతంగా నియమించారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







