ప్రముఖ ఎన్ఐఆర్ వ్యాపార వేత్త, సినీ నిర్మాత అట్లాస్ రామచంద్రన్ మృతి
- October 03, 2022
దుబాయ్: ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపార వేత్త, సినీ నిర్మాత అయిన అట్లాస్ రామచంద్రన్ (80) చనిపోయారు. ఆదివారం రాత్రి గుండెపోటుతో దుబాయ్ లోని ఆస్టర్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా కొన్ని రోజులుగా ఆయన ఆనారోగ్యంతో ఉన్నారు. ఛాతిలో నొప్పి రావడంతో శనివారం ఆయన హాస్పిటల్ లో చేరారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు తో మరణించారు. రామచంద్రాన్ దుబాయ్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్తగా పేరుగాంచారు. అంతేకాకుండా నిర్మాతగా పలు సినిమాలు తీశారు. 13 చిత్రాల్లో నటించారు. ఒక సినిమాకు దర్శకత్వం వహించారు. రామచంద్రన్ కు భార్య, కుమార్తె మంజు రామచంద్రన్ ఉన్నారు. ఇటీవలే తన 80 వ పుట్టిన రోజును బూర్జ్ ఖలీఫాలోని తన నివాసంలో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దశాబ్దాల క్రితమే భారత్ నుంచి యూఏఈ వచ్చిన ఆయన ఇక్కడే స్థిరపడ్డారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







