ప్రముఖ ఎన్ఐఆర్ వ్యాపార వేత్త, సినీ నిర్మాత అట్లాస్ రామచంద్రన్ మృతి
- October 03, 2022
దుబాయ్: ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపార వేత్త, సినీ నిర్మాత అయిన అట్లాస్ రామచంద్రన్ (80) చనిపోయారు. ఆదివారం రాత్రి గుండెపోటుతో దుబాయ్ లోని ఆస్టర్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా కొన్ని రోజులుగా ఆయన ఆనారోగ్యంతో ఉన్నారు. ఛాతిలో నొప్పి రావడంతో శనివారం ఆయన హాస్పిటల్ లో చేరారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు తో మరణించారు. రామచంద్రాన్ దుబాయ్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్తగా పేరుగాంచారు. అంతేకాకుండా నిర్మాతగా పలు సినిమాలు తీశారు. 13 చిత్రాల్లో నటించారు. ఒక సినిమాకు దర్శకత్వం వహించారు. రామచంద్రన్ కు భార్య, కుమార్తె మంజు రామచంద్రన్ ఉన్నారు. ఇటీవలే తన 80 వ పుట్టిన రోజును బూర్జ్ ఖలీఫాలోని తన నివాసంలో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దశాబ్దాల క్రితమే భారత్ నుంచి యూఏఈ వచ్చిన ఆయన ఇక్కడే స్థిరపడ్డారు.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









