ప్రముఖ ఎన్ఐఆర్ వ్యాపార వేత్త, సినీ నిర్మాత అట్లాస్ రామచంద్రన్ మృతి
- October 03, 2022
దుబాయ్: ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపార వేత్త, సినీ నిర్మాత అయిన అట్లాస్ రామచంద్రన్ (80) చనిపోయారు. ఆదివారం రాత్రి గుండెపోటుతో దుబాయ్ లోని ఆస్టర్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా కొన్ని రోజులుగా ఆయన ఆనారోగ్యంతో ఉన్నారు. ఛాతిలో నొప్పి రావడంతో శనివారం ఆయన హాస్పిటల్ లో చేరారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు తో మరణించారు. రామచంద్రాన్ దుబాయ్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్తగా పేరుగాంచారు. అంతేకాకుండా నిర్మాతగా పలు సినిమాలు తీశారు. 13 చిత్రాల్లో నటించారు. ఒక సినిమాకు దర్శకత్వం వహించారు. రామచంద్రన్ కు భార్య, కుమార్తె మంజు రామచంద్రన్ ఉన్నారు. ఇటీవలే తన 80 వ పుట్టిన రోజును బూర్జ్ ఖలీఫాలోని తన నివాసంలో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దశాబ్దాల క్రితమే భారత్ నుంచి యూఏఈ వచ్చిన ఆయన ఇక్కడే స్థిరపడ్డారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







