ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టనున్న మస్కట్ మున్సిపాలిటీ

- October 03, 2022 , by Maagulf
ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టనున్న మస్కట్ మున్సిపాలిటీ

మస్కట్: మస్కట్ లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఈ సమస్య మస్కట్ మున్సిపల్ అధికారులు ఫోకస్ పెట్టారు. ట్రాఫిక్ తగ్గించేందుకు కొత్త ప్రాజెక్ట్ లు నిర్మించాలని నిర్ణయించారు. బ్రిడ్జిలు, టన్నెల్స్ తో పాటు మస్కట్ ఎక్స్ ప్రెస్ వే ని ఐదు లేన్ గా విస్తరిస్తామని ప్రాజెక్ట్ ల డైరెక్టరేట్ ఖలీఫా అల్ సియాబీ తెలిపారు. సాహ్వా టవర్ సమీపంలోని బ్రిడ్జి, టన్నెల్ కు సంబంధించిన డిజైన్ దాదాపు పూర్తైందన్నారు. అటు మస్కట్ ఎక్స్ ప్రెస్ హై వే ను మూడు నుంచి ఐదు లేన్ గా విస్తరించే పనులు వచ్చే ఏడాది ప్రాంరభిస్తామన్నారు. సిటీలో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరించేందుకు దాదాపు 18 వీధులను విస్తరిస్తున్నామన్నారు. " 2023లో చాలా ప్రాజెక్ట్ ల పనులు ప్రారంభిస్తాం. 18 నుంచి 20 నెలల్లో వీటిని పూర్తిచేస్తాం " అని సియాబీ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com