ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టనున్న మస్కట్ మున్సిపాలిటీ
- October 03, 2022
మస్కట్: మస్కట్ లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఈ సమస్య మస్కట్ మున్సిపల్ అధికారులు ఫోకస్ పెట్టారు. ట్రాఫిక్ తగ్గించేందుకు కొత్త ప్రాజెక్ట్ లు నిర్మించాలని నిర్ణయించారు. బ్రిడ్జిలు, టన్నెల్స్ తో పాటు మస్కట్ ఎక్స్ ప్రెస్ వే ని ఐదు లేన్ గా విస్తరిస్తామని ప్రాజెక్ట్ ల డైరెక్టరేట్ ఖలీఫా అల్ సియాబీ తెలిపారు. సాహ్వా టవర్ సమీపంలోని బ్రిడ్జి, టన్నెల్ కు సంబంధించిన డిజైన్ దాదాపు పూర్తైందన్నారు. అటు మస్కట్ ఎక్స్ ప్రెస్ హై వే ను మూడు నుంచి ఐదు లేన్ గా విస్తరించే పనులు వచ్చే ఏడాది ప్రాంరభిస్తామన్నారు. సిటీలో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరించేందుకు దాదాపు 18 వీధులను విస్తరిస్తున్నామన్నారు. " 2023లో చాలా ప్రాజెక్ట్ ల పనులు ప్రారంభిస్తాం. 18 నుంచి 20 నెలల్లో వీటిని పూర్తిచేస్తాం " అని సియాబీ చెప్పారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







