ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టనున్న మస్కట్ మున్సిపాలిటీ
- October 03, 2022
మస్కట్: మస్కట్ లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఈ సమస్య మస్కట్ మున్సిపల్ అధికారులు ఫోకస్ పెట్టారు. ట్రాఫిక్ తగ్గించేందుకు కొత్త ప్రాజెక్ట్ లు నిర్మించాలని నిర్ణయించారు. బ్రిడ్జిలు, టన్నెల్స్ తో పాటు మస్కట్ ఎక్స్ ప్రెస్ వే ని ఐదు లేన్ గా విస్తరిస్తామని ప్రాజెక్ట్ ల డైరెక్టరేట్ ఖలీఫా అల్ సియాబీ తెలిపారు. సాహ్వా టవర్ సమీపంలోని బ్రిడ్జి, టన్నెల్ కు సంబంధించిన డిజైన్ దాదాపు పూర్తైందన్నారు. అటు మస్కట్ ఎక్స్ ప్రెస్ హై వే ను మూడు నుంచి ఐదు లేన్ గా విస్తరించే పనులు వచ్చే ఏడాది ప్రాంరభిస్తామన్నారు. సిటీలో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరించేందుకు దాదాపు 18 వీధులను విస్తరిస్తున్నామన్నారు. " 2023లో చాలా ప్రాజెక్ట్ ల పనులు ప్రారంభిస్తాం. 18 నుంచి 20 నెలల్లో వీటిని పూర్తిచేస్తాం " అని సియాబీ చెప్పారు.
తాజా వార్తలు
- జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు









