ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టనున్న మస్కట్ మున్సిపాలిటీ
- October 03, 2022
మస్కట్: మస్కట్ లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఈ సమస్య మస్కట్ మున్సిపల్ అధికారులు ఫోకస్ పెట్టారు. ట్రాఫిక్ తగ్గించేందుకు కొత్త ప్రాజెక్ట్ లు నిర్మించాలని నిర్ణయించారు. బ్రిడ్జిలు, టన్నెల్స్ తో పాటు మస్కట్ ఎక్స్ ప్రెస్ వే ని ఐదు లేన్ గా విస్తరిస్తామని ప్రాజెక్ట్ ల డైరెక్టరేట్ ఖలీఫా అల్ సియాబీ తెలిపారు. సాహ్వా టవర్ సమీపంలోని బ్రిడ్జి, టన్నెల్ కు సంబంధించిన డిజైన్ దాదాపు పూర్తైందన్నారు. అటు మస్కట్ ఎక్స్ ప్రెస్ హై వే ను మూడు నుంచి ఐదు లేన్ గా విస్తరించే పనులు వచ్చే ఏడాది ప్రాంరభిస్తామన్నారు. సిటీలో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరించేందుకు దాదాపు 18 వీధులను విస్తరిస్తున్నామన్నారు. " 2023లో చాలా ప్రాజెక్ట్ ల పనులు ప్రారంభిస్తాం. 18 నుంచి 20 నెలల్లో వీటిని పూర్తిచేస్తాం " అని సియాబీ చెప్పారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక నిధి సమీకరణ కార్యక్రమం
- రైల్వే శాఖ కీలక నిర్ణయం...
- శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు
- వయనాడులో పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- వైఎస్ జగన్కు అస్వస్థత.. పులివెందుల కార్యక్రమాల రద్దు
- ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, ఫ్లూ షాట్ డ్రైవ్
- ఏపీ ప్రభుత్వం మరో బిగ్ డెసీషన్..
- విబిజీ రామ్జీతో గ్రామాల్లో నవశకం: ఎంపీ డి.కె అరుణ
- రాచకొండ సుధీర్ బాబుకు అదనపు డిజిగా పదోన్నతి







