ఉమ్రా యాత్రికులకు గుడ్ న్యూస్...
- October 03, 2022
మక్కా: ఉమ్రా యాత్రికులకు సౌదీ అరేబియా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉమ్రా యాత్ర కు వచ్చే అన్ని దేశాల పౌరుల వీసాలను మూడు నెలల పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఒక నెల మాత్రమే గడువు ఉండేది. దాన్ని మూడు నెలలకు పొడగిస్తున్నట్లు హజ్, ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్-రబియా తెలిపారు. ఉజ్బెకిస్తాన్ పర్యటనలో ఉన్న ఆయన ఈ ప్రకటన చేశారు. సౌదీ-ఉజ్బెకిస్తాన్ మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. అనంతరం ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ ను సౌదీ మంత్రి అల్-రబియా కలిశారు. సౌదీ రాజు సల్మాన్, ప్రిన్స్, ప్రధాని మహ్మద్ బిన్ సల్మాన్ ల విషెస్ ను ఉజ్బెకిస్తాన్ ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రాక సంబంధాలపై చర్చించారు. ఇక హజ్ యాత్రకు ఉజ్బెకిస్తాన్ నుంచి ఏటా భారీగా యాత్రికులు వస్తుంటారు. కరోనా తర్వాత దాదాపు 12 వేల మంది హజ్ యాత్రకు వచ్చారు. ఐతే ఉమ్రా యాత్రకు వచ్చే వారికి అన్ని మరిన్ని సేవలతో పాటు సులభంగా విజిట్, ఉమ్రా వీసాలు జారీ చేయటంపై చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య పలు రంగాల్లో మరింత సహకారం పెంపొందిచుకోవాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..







