ధృవీకరణ సేవల కోసం ఆన్లైన్ బుకింగ్: ఇండియన్ కాన్సులేట్
- October 04, 2022
దుబాయ్: ధృవీకరణ సేవల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఆన్లైన్ అపాయింట్మెంట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు దుబాయ్లోని కాన్సులేట్-జనరల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.అక్టోబర్ 10 నుంచి ఈ సిస్టమ్ అమల్లోకి రానుందని తెలిపింది. భారతీయ, విదేశీ పౌరుల కోసం ధృవీకరణ సేవలు కాన్సులేట్ ద్వారా SG IVS గ్లోబల్ కమర్షియల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్కు అవుట్సోర్స్ చేయబడ్డాయని, ఇది 1వ అంతస్తు, రూమ్ నంబర్ 102, 103 & 104, బిజినెస్ అట్రియం, ఔద్ మెథా, దుబాయ్లో ఉందని ఎంబసీ వెల్లడించింది. ధృవీకరణ సేవల కోసం SG IVS గ్లోబల్ కమర్షియల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో దరఖాస్తును సమర్పించడానికి దరఖాస్తుదారు ఇప్పుడు ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అక్టోబరు 10 నుండి అత్యవసర కేసులు మినహా ఎటువంటి వాక్-ఇన్లు అనుమతించబడవని ఎంబసీ స్పష్టం చేసింది.
అపాయింట్మెంట్ బుకింగ్ ఇలా..
ఎ) IVS గ్లోబల్ వెబ్సైట్ https://www.ivsglobalattestation.com/సందర్శించండి.
బి) అపాయింట్మెంట్ ట్యాబ్ని క్లిక్ చేయండి
సి) సేవను ఎంచుకోండి. మీ ID ప్రకారం పర్సనల్ వివరాలను నమోదు చేయండి.
d) ధృవీకరణ కోసం, అపాయింట్మెంట్ వివరాలను పొందేందుకు ఇమెయిల్ ఐడిని నమోదు చేయాలి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







