మహిళపై 50,000 దిర్హామ్ల దావా.. వ్యక్తి పిటిషన్ కొట్టేసిన కోర్టు
- October 06, 2022
యూఏఈ: చేతబడి చేస్తున్నాడని ఆరోపించి.. తన ప్రతిష్టను దెబ్బతీసిన మహిళపై వ్యక్తి వేసిన 50,000 దిర్హామ్ల దావాను కోర్టు కొట్టేసింది. సదరు వ్యక్తి ప్రతిష్టను మహిళ దెబ్బతీసిందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నష్టపరిహార వ్యాజ్యాన్ని అబుదాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టు తిరస్కరించింది. అతను చేతబడి చేస్తున్నాడని అనుమానంతో ఫిర్యాదు చేసినప్పుడు, మహిళ తనకున్న న్యాయపరమైన మార్గాలను ఉపయోగించిందని కోర్టు అభిప్రాయపడ్డది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తాను చేతబడి చేశానని మహిళ తనపై క్రిమినల్ ఫిర్యాదు చేసిందని, అయితే సాక్ష్యాధారాలు లేకపోవడంతో పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసును కోర్టుకు తరలించకముందే తిరస్కరించిందని సదరు వ్యక్తి తెలిపాడు. ఈ ఆరోపణలు తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, పని చేసే ప్రాంతంలో తన ప్రతిష్టను దెబ్బతీసిందని ఆ వ్యక్తి తన వ్యాజ్యంలో పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







