సీబ్లో 225 కిలోల కలుషిత ఆహారం ధ్వంసం
- October 07, 2022
మస్కట్: సీబ్లోని 211 కేఫ్లు, రెస్టారెంట్లలో మస్కట్ మునిసిపాలిటీ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని 10 రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేసినట్లు మునిసిపాలిటీ తెలిపింది. దీంతోపాటు తినేందుకు పనికిరాని 225.6 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. పబ్లిక్ హెల్త్ నిబంధనలను కేఫ్ లు, రెస్టారెంట్లు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఉపరితలాలను తరచుగా క్రిమిసంహారక చేయడం, సరైన వెంటిలేషన్ను కల్పించడం, ప్రతి కార్మికుడు/ఉద్యోగికి తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలను అందించాలని సూచించింది. నిబంధనలు పాటించని వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మస్కట్ మున్సిపాలిటీ హెచ్చరించింది. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఏదైనా నిబంధల ఉల్లంఘనలు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1111కి కాల్ చేసి చేప్పాలని కోరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు









