సీబ్లో 225 కిలోల కలుషిత ఆహారం ధ్వంసం
- October 07, 2022
మస్కట్: సీబ్లోని 211 కేఫ్లు, రెస్టారెంట్లలో మస్కట్ మునిసిపాలిటీ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని 10 రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేసినట్లు మునిసిపాలిటీ తెలిపింది. దీంతోపాటు తినేందుకు పనికిరాని 225.6 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. పబ్లిక్ హెల్త్ నిబంధనలను కేఫ్ లు, రెస్టారెంట్లు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఉపరితలాలను తరచుగా క్రిమిసంహారక చేయడం, సరైన వెంటిలేషన్ను కల్పించడం, ప్రతి కార్మికుడు/ఉద్యోగికి తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలను అందించాలని సూచించింది. నిబంధనలు పాటించని వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మస్కట్ మున్సిపాలిటీ హెచ్చరించింది. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఏదైనా నిబంధల ఉల్లంఘనలు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1111కి కాల్ చేసి చేప్పాలని కోరింది.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







